బీజేపీ గెలిస్తే సీఎం ఆయనే... కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి గురువారం లక్నోలో సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ...అమిత్ షాను ప్రధాన మంత్రి చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైందని తెలిపారు.
ఆయనను పీఎం చేసేందుకే... శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, దేవేంద్ర ఫడ్నవీస్ ఇలా ప్రముఖులందరినీ పక్కన బెట్టారని ఆరోపించారు. 2025 లో నరేంద్ర మోడీకీ 75 ఏళ్లు వచ్చిన తర్వాత అమిత్ షాను ప్రధాన మంత్రిని చేస్తారని పేర్కొన్నారు. పీఎం మోడీ వయస్సు, పదవీ విరమణ సమస్యను లేవనెత్తిన ఇప్పుడు, అమిత్ షాతో సహా ఇతర నాయకులు దానిని వ్యతిరేకించారిని తెలిపారు.
కానీ 75 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయనని మోడీ ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. రెండు మూడు నెలల్లో యూపీ సీఎం యోగి కూడా పదవి నుంచి దిగిపోతారని జోస్యం చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన తర్వాత రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ ప్రణాళికలు రెడీ చేసిందని ఆరోపించారు.
బీజేపీ గెలిస్తే సీఎం ఆయనే... కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి గురువారం లక్నోలో సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ...అమిత్ షాను ప్రధాన మంత్రి చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైందని తెలిపారు.
ఆయనను పీఎం చేసేందుకే... శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, దేవేంద్ర ఫడ్నవీస్ ఇలా ప్రముఖులందరినీ పక్కన బెట్టారని ఆరోపించారు. 2025 లో నరేంద్ర మోడీకీ 75 ఏళ్లు వచ్చిన తర్వాత అమిత్ షాను ప్రధాన మంత్రిని చేస్తారని పేర్కొన్నారు. పీఎం మోడీ వయస్సు, పదవీ విరమణ సమస్యను లేవనెత్తిన ఇప్పుడు, అమిత్ షాతో సహా ఇతర నాయకులు దానిని వ్యతిరేకించారిని తెలిపారు.
కానీ 75 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయనని మోడీ ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. రెండు మూడు నెలల్లో యూపీ సీఎం యోగి కూడా పదవి నుంచి దిగిపోతారని జోస్యం చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన తర్వాత రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ ప్రణాళికలు రెడీ చేసిందని ఆరోపించారు.


