మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ
- సైబర్ నేరాలకు భయపడొద్దు.. వెంటనే పోలీసులను ఆశ్రయించండి.
- డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తలు తప్పనిసరి.. విద్యార్థినులకు శైలజ సూచనలు.
Dr Rayapati Shailaja: అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విభాగ సమావేశ మందిరంలో మహిళల భద్రత, సైబర్ అవగాహనపై మంగళవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో మహిళలు, బాలికలు స్టాకింగ్, సైబర్ స్టాకింగ్, సోషల్ మీడియా మోసాలు, ఆన్లైన్ వేధింపులు వంటి నేరాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతుందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ నేరాలకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసు శాఖను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నేరస్థులను చూసి భయపడకుండా చట్టపరంగా పోరాడితే తప్పకుండా న్యాయం జరుగుతుందని ధైర్యం చెప్పారు.
వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని విద్యార్థినులకు సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ అనుమానాస్పద లింకులు, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధికారులు, విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై నిర్వహించిన ఈ అవగాహన సదస్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.
మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ
Dr Rayapati Shailaja: అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విభాగ సమావేశ మందిరంలో మహిళల భద్రత, సైబర్ అవగాహనపై మంగళవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో మహిళలు, బాలికలు స్టాకింగ్, సైబర్ స్టాకింగ్, సోషల్ మీడియా మోసాలు, ఆన్లైన్ వేధింపులు వంటి నేరాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతుందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ నేరాలకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసు శాఖను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నేరస్థులను చూసి భయపడకుండా చట్టపరంగా పోరాడితే తప్పకుండా న్యాయం జరుగుతుందని ధైర్యం చెప్పారు.
వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని విద్యార్థినులకు సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ అనుమానాస్పద లింకులు, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధికారులు, విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై నిర్వహించిన ఈ అవగాహన సదస్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.


