వియత్నాంలో భారతీయ పర్యాటకుడి నిర్వాకం.. క్యాబ్ ఛార్జీ చెల్లించకుండా పరార్
- భారతీయుడి తీరుపై విమర్శలు.. సోషల్ మీడియాలో డ్రైవర్ ఆవేదన
Vietnam Indian Tourist: మనోళ్లు మారరు.. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తమ బుద్ధులను వదులుకోరని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి అక్కడ మన దేశ పరువును బజారున పడేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా వియత్నాంలో ఓ భారతీయ పర్యాటకుడు చేసిన పనికి భారతీయుల పట్ల ఉన్న గౌరవం కాస్తా గంగలో కలిసిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి!
ఉచిత ప్రయాణం.. భారతీయుడి చేతివాటం
సంఘటన వివరాల్లోకి వెళ్తే.. గౌరవ్ అగర్వాల్ అనే పర్యాటకుడు వియత్నాంలో ఒక క్యాబ్ను బుక్ చేసుకున్నాడు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మీటర్ ఛార్జీ చెల్లించాల్సి రాగా.. నా దగ్గర రూపాయి లేదంటూ ఏమీ తెలియనట్లు జారుకున్నాడు. సదరు డ్రైవర్ "డబ్బులు ఇవ్వండి సార్" అని ఎంత వేడుకున్నా.. గౌరవ్ కనీసం కరుణించకుండా, సమాధానం కూడా చెప్పకుండా అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో నిరాశకు గురైన డ్రైవర్, ఆ భారతీయుడి ఘనకార్యాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్తా రచ్చగా మారింది.
ఒక విదేశీయుడి ఉపాధిని దెబ్బతీయడమే కాకుండా.. భారతీయులందరి ఇమేజ్ను చెడగొట్టాడని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నెటిజన్లలో భిన్నమైన అభిప్రాయాలు, తీవ్ర వివాదం రేగుతోంది. మన దేశంలో అలవాటైన ఉచితాల అలవాట్లను, తెలివితేటలను విదేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారా? ఒకరిద్దరు చేసే ఇలాంటి దిగజారుడు పనుల వల్ల రేపు విదేశాల్లో భారతీయులకు రుణాలు, క్యాబ్లు, రూమ్లు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుందని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.
మరికొందరు మాత్రం "ఎక్కడైనా మంచి, చెడు మనుషులు ఉంటారు. ఒక్క గౌరవ్ అగర్వాల్ చేసిన చిల్లర పనికి మొత్తం 140 కోట్ల మంది భారతీయులను నిందించడం సరికాదని వాదిస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఉచితాలు అనుభవించడం, రూల్స్ అతిక్రమించడం, ఛార్జీలు ఎగ్గొట్టడం లాంటి పనులు మన దేశ సంస్కృతిని కాదని, దిగజారుడుతనానికి నిదర్శనమని పర్యాటక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా విదేశాలకు వెళ్లే భారతీయులు బాధ్యతగా ప్రవర్తించకపోతే.. ప్రపంచ పటంలో భారత పర్యాటకుల ఇమేజ్ తీవ్రంగా దెబ్బతినడం ఖాయం!
వియత్నాంలో భారతీయ పర్యాటకుడి నిర్వాకం.. క్యాబ్ ఛార్జీ చెల్లించకుండా పరార్
Vietnam Indian Tourist: మనోళ్లు మారరు.. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తమ బుద్ధులను వదులుకోరని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి అక్కడ మన దేశ పరువును బజారున పడేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా వియత్నాంలో ఓ భారతీయ పర్యాటకుడు చేసిన పనికి భారతీయుల పట్ల ఉన్న గౌరవం కాస్తా గంగలో కలిసిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి!
ఉచిత ప్రయాణం.. భారతీయుడి చేతివాటం
సంఘటన వివరాల్లోకి వెళ్తే.. గౌరవ్ అగర్వాల్ అనే పర్యాటకుడు వియత్నాంలో ఒక క్యాబ్ను బుక్ చేసుకున్నాడు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మీటర్ ఛార్జీ చెల్లించాల్సి రాగా.. నా దగ్గర రూపాయి లేదంటూ ఏమీ తెలియనట్లు జారుకున్నాడు. సదరు డ్రైవర్ "డబ్బులు ఇవ్వండి సార్" అని ఎంత వేడుకున్నా.. గౌరవ్ కనీసం కరుణించకుండా, సమాధానం కూడా చెప్పకుండా అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో నిరాశకు గురైన డ్రైవర్, ఆ భారతీయుడి ఘనకార్యాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్తా రచ్చగా మారింది.
ఒక విదేశీయుడి ఉపాధిని దెబ్బతీయడమే కాకుండా.. భారతీయులందరి ఇమేజ్ను చెడగొట్టాడని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నెటిజన్లలో భిన్నమైన అభిప్రాయాలు, తీవ్ర వివాదం రేగుతోంది. మన దేశంలో అలవాటైన ఉచితాల అలవాట్లను, తెలివితేటలను విదేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారా? ఒకరిద్దరు చేసే ఇలాంటి దిగజారుడు పనుల వల్ల రేపు విదేశాల్లో భారతీయులకు రుణాలు, క్యాబ్లు, రూమ్లు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుందని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.
మరికొందరు మాత్రం "ఎక్కడైనా మంచి, చెడు మనుషులు ఉంటారు. ఒక్క గౌరవ్ అగర్వాల్ చేసిన చిల్లర పనికి మొత్తం 140 కోట్ల మంది భారతీయులను నిందించడం సరికాదని వాదిస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఉచితాలు అనుభవించడం, రూల్స్ అతిక్రమించడం, ఛార్జీలు ఎగ్గొట్టడం లాంటి పనులు మన దేశ సంస్కృతిని కాదని, దిగజారుడుతనానికి నిదర్శనమని పర్యాటక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా విదేశాలకు వెళ్లే భారతీయులు బాధ్యతగా ప్రవర్తించకపోతే.. ప్రపంచ పటంలో భారత పర్యాటకుల ఇమేజ్ తీవ్రంగా దెబ్బతినడం ఖాయం!


