ప్రభుత్వ ఉద్యోగానికి గుడ్బై చెప్పిన టీచర్ గౌతమి.. డీఈవోపై సంచలన ఆరోపణలు
- ఖమ్మం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు భూక్య గౌతమి రాజీనామా
Khammam Teacher: ఇన్స్టాగ్రామ్ రీల్స్ వ్యవహారంతో ఇటీవల సస్పెన్షన్కు గురైన ఖమ్మం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు భూక్య గౌతమి తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. సస్పెన్షన్ను ఎత్తివేసిన తర్వాత కూడా తనపై అవమానకరంగా ప్రవర్తించారని, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె ఆరోపించారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక చివరకు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను రూపొందించిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ను పాఠశాల విధుల సమయంలో కాకుండా ఇంట్లోనే చిత్రీకరించానని, విద్యార్థుల బోధనకు లేదా పాఠశాల పనులకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని గౌతమి స్పష్టం చేశారు.
అయినప్పటికీ తనపై విమర్శలు, అవమానాలు కొనసాగాయని, తన ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించారని పేర్కొన్నారు. నిరంతరం ఎదురైన విమర్శలు, మానసిక ఒత్తిడిని భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని గౌతమి తెలిపారు. "కష్టపడి పనిచేసే నా లాంటి ఉపాధ్యాయులకు ఇక్కడ స్థానం లేదని అర్థమైంది" అంటూ ఆమె భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే గౌతమి చేసిన ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఆమె రాజీనామా, ఆరోపణల అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగానికి గుడ్బై చెప్పిన టీచర్ గౌతమి.. డీఈవోపై సంచలన ఆరోపణలు
Khammam Teacher: ఇన్స్టాగ్రామ్ రీల్స్ వ్యవహారంతో ఇటీవల సస్పెన్షన్కు గురైన ఖమ్మం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు భూక్య గౌతమి తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. సస్పెన్షన్ను ఎత్తివేసిన తర్వాత కూడా తనపై అవమానకరంగా ప్రవర్తించారని, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె ఆరోపించారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక చివరకు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను రూపొందించిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ను పాఠశాల విధుల సమయంలో కాకుండా ఇంట్లోనే చిత్రీకరించానని, విద్యార్థుల బోధనకు లేదా పాఠశాల పనులకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని గౌతమి స్పష్టం చేశారు.
అయినప్పటికీ తనపై విమర్శలు, అవమానాలు కొనసాగాయని, తన ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించారని పేర్కొన్నారు. నిరంతరం ఎదురైన విమర్శలు, మానసిక ఒత్తిడిని భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని గౌతమి తెలిపారు. "కష్టపడి పనిచేసే నా లాంటి ఉపాధ్యాయులకు ఇక్కడ స్థానం లేదని అర్థమైంది" అంటూ ఆమె భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే గౌతమి చేసిన ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఆమె రాజీనామా, ఆరోపణల అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది.


