వనస్థలిపురంలో దొంగల బీభత్సం.. రెండు రోజుల్లో నాలుగు ఆవులు చోరీ
- వనస్థలిపురంలో దొంగల బీభత్సం.. రెండు రోజుల్లో నాలుగు ఆవులు చోరీ
Vanasthalipuram News: హైదరాబాద్లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సామనగర్ ప్రాంతంలో పశువుల దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుసగా రెండు రోజుల వ్యవధిలోనే నాలుగు ఆవులను దొంగలు అపహరించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో పశువులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దొంగలు ఆవులను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు పక్కా ప్రణాళికతో పశువులను అపహరిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సామనగర్ ప్రజలు భయం
ఇటీవల వరుస దొంగతనాలు జరగడంతో సామనగర్ ప్రజలు భయంతో గడుపుతున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల వద్ద కట్టిన పశువులు కూడా సురక్షితంగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారమైన పశువులను దొంగలు ఎత్తుకెళ్తుండటంతో భారీ నష్టం వాటిల్లుతోందని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పశువుల దొంగలను త్వరగా అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితులు, స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
వనస్థలిపురంలో దొంగల బీభత్సం.. రెండు రోజుల్లో నాలుగు ఆవులు చోరీ
Vanasthalipuram News: హైదరాబాద్లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సామనగర్ ప్రాంతంలో పశువుల దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుసగా రెండు రోజుల వ్యవధిలోనే నాలుగు ఆవులను దొంగలు అపహరించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో పశువులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దొంగలు ఆవులను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు పక్కా ప్రణాళికతో పశువులను అపహరిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సామనగర్ ప్రజలు భయం
ఇటీవల వరుస దొంగతనాలు జరగడంతో సామనగర్ ప్రజలు భయంతో గడుపుతున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల వద్ద కట్టిన పశువులు కూడా సురక్షితంగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారమైన పశువులను దొంగలు ఎత్తుకెళ్తుండటంతో భారీ నష్టం వాటిల్లుతోందని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పశువుల దొంగలను త్వరగా అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితులు, స్థానికులు పోలీసులను కోరుతున్నారు.


