మజ్లిస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే ఏకైక పార్టీ బీజేపీ.. అమిత్​ షా సంచలన వ్యాఖ్యలు

మజ్లిస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే ఏకైక పార్టీ బీజేపీ.. అమిత్​ షా సంచలన వ్యాఖ్యలు

విశ్వంభర, వికారాబాద్​ : సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్ కు లేదని, బీజేపీ ఉన్నంతవరకు పీవోకే పాక్ వశం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రవాదులను అణిచి వేసినట్లు తెలిపారు. వికారాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి హస్తం పార్టీ ఏనాడూ పాటుపడలేదు. ఆ పార్టీతో పాటు మజ్లిస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే శక్తి కేవలం బీజేపీ కే ఉంది అని అమిత్​ షా తెలిపారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని అన్నారు. ఉగ్రవాదులను కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ వచ్చిందని ఆరోపించారు. దేశంలో ఉగ్రవాదాన్ని పారద్రోలడానికి మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. అయోధ్యలో రామ మందిర అంశాన్ని కాంగ్రెస్ 70 ఏళ్లుగా సాగదీస్తూ వచ్చిందని, ఆలయ ప్రాణ ప్రతిష్ఠకు సైతం కాంగ్రెస్ నేతలు పాల్గొన లేదని వివరించారు.

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు