సీఐ దేవానంద్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆర్ఎస్ఐ రామకృష్ణ ఆరోపణలు
- సీఐ దేవానంద్పై ఆర్ఎస్ఐ రామకృష్ణ సంచలన ఆరోపణలు.. డీఐజీకి న్యాయం చేయాలని విజ్ఞప్తి
Andhra Pradesh Police: అనంతపురం నగరంలోని రాంనగర్ కార్తికేయ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ఆర్ఎస్ఐ ఎస్.పీ. రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న సీఐ కె. దేవానంద్, ఆయన భార్య రూప వల్ల తనకు ప్రాణహాని ఉందని మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని జిల్లా డీఐజీని కోరారు.
ఆర్ఎస్ఐ రామకృష్ణ కథనం ప్రకారం.. గత జూలై 30న సీఐ దేవానంద్ తనపై దాడి చేసి లాఠీతో కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనలో తన కుడి చేయి విరిగిందని, కంటికి కూడా గాయమైందని తెలిపారు. అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత మరుసటి రోజు జిల్లా డీఐజీని కలిసి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
తమపై దాడి జరిగినప్పటికీ, తమనే తప్పుబడేలా మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేశారని రామకృష్ణ ఆరోపించారు. తన వాదనను వినకుండా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేయడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని అన్నారు. న్యాయం కోసం అనంతపురం ప్రెస్ క్లబ్ను ఆశ్రయించినా తనకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై జిల్లా డీఐజీ సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆర్ఎస్ఐ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
సీఐ దేవానంద్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆర్ఎస్ఐ రామకృష్ణ ఆరోపణలు
Andhra Pradesh Police: అనంతపురం నగరంలోని రాంనగర్ కార్తికేయ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ఆర్ఎస్ఐ ఎస్.పీ. రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న సీఐ కె. దేవానంద్, ఆయన భార్య రూప వల్ల తనకు ప్రాణహాని ఉందని మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని జిల్లా డీఐజీని కోరారు.
ఆర్ఎస్ఐ రామకృష్ణ కథనం ప్రకారం.. గత జూలై 30న సీఐ దేవానంద్ తనపై దాడి చేసి లాఠీతో కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనలో తన కుడి చేయి విరిగిందని, కంటికి కూడా గాయమైందని తెలిపారు. అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత మరుసటి రోజు జిల్లా డీఐజీని కలిసి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
తమపై దాడి జరిగినప్పటికీ, తమనే తప్పుబడేలా మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేశారని రామకృష్ణ ఆరోపించారు. తన వాదనను వినకుండా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేయడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని అన్నారు. న్యాయం కోసం అనంతపురం ప్రెస్ క్లబ్ను ఆశ్రయించినా తనకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై జిల్లా డీఐజీ సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆర్ఎస్ఐ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు.


