యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

9

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 15 :- తెలంగాణ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని ఆలయంలో సోమవారం నాడు యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,ఆలయ సిబ్బంది అధికారులు,స్థానికులు వేలాది మంది భక్తులు,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  కూతుర్లు అఖిల శృతి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం అందజేసారూ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూన్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక వ్రత మండపం వద్ద మొక్కలు నాటారు. అనంతరం మండలంలోని సైదాపూర్ గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు.

Read More అవోప ఉపాధ్యక్షుడిగా వీర బొమ్మ రమేష్