ఆ హీరోయిన్తో రొమాంటిక్ సీన్లలో నటించలేను: విజయ్ సేతుపతి
ఉప్పెన చిత్రంతోనే కృతి శెట్టి హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటించారు.
ఉప్పెన చిత్రంతోనే కృతి శెట్టి హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటించారు. బేబమ్మగా కృతి తండ్రి పాత్రలో విజయ్ నటించారు. ఈ ఇద్దరి మధ్య చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఉప్పెన తర్వాత రెండు సినిమాల్లో కృతితో హీరోయిన్గా నటించే ఛాన్స్ వచ్చినా విజయ్ సేతుపతి తిరస్కరించారు. దీనికి కారణం ఆయన ఆమెతో ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించడమేనని విజయ్ తెలిపాడు.
విజయ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్గా నిథిలన్ స్వామినాథన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్, భారతీరాజా, అభిరామి, మమత మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహారాజ జూన్ 14న థియేటర్స్లో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ కృతి శెట్టి గురించి మరోసారి విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కూతురిగా భావించిన కృతి శెట్టికి జోడీగా నటించడం తన వల్ల కాదు.. నేను నటించిన డీఎస్పీ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్గా తీసుకుంటే చేయలేనని దర్శక నిర్మాతలకు చెప్పా. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ అస్సలు చేయలేను. ‘ఉప్పెన’ క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కృతి చాలా కంగారు పడింది. నాకు నీ వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు, నన్ను నీ తండ్రిగా భావించు అని ధైర్యం చెప్పా. కూతురిగా భావించిన ఆమెకు జోడీగా ఎలా నటించాలి. అది నా వల్ల కాదు' అని విజయ్ తెలిపారు.