మరికొద్ది గంటల్లో ఎన్నికలు అనగా… నాగబాబుకు ఈసీ బిగ్​ షాక్

మరికొద్ది గంటల్లో ఎన్నికలు అనగా… నాగబాబుకు ఈసీ బిగ్​ షాక్

విశ్వంభర, వెబ్ డెస్క్ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబుకు ఈసీ భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఓ వీడియో రిలీజ్​ చేశారు. అందులో భాగంగా ఓటర్లకు డబ్బు ఇచ్చిన తర్వాత గుర్తుగా చేతి వేలికి కూడి ఇంకు వేస్తున్నారని ఆ వీడియోలో వివరించారు.

ఈ క్రమంలోనే ఆయన చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగబాబు ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఓటర్లను రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్లారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జాయింట్ కలెక్టర్​, రిటర్నింగ్ అధికారకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం నియమించిన అధికారులకు మాత్రమే చెరగని సిరా ఉపయోగించే అధికారం ఉందని, ఎవరైనా సిరాను వేరే అవసరాలకు వినియోగిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈసీ వార్నింగ్ ఇచ్చింది.



Related Posts