చేనేత ల కోసం దేశ వ్యాప్త ఉద్యమం చేస్తాం. - గడ్డం జగన్నాధం - ప్రధాన కార్యదర్శి , అఖిల భారత పద్మశాలి సంఘం.
పుట్టపాక లో నేతన్న యాత్ర
On
విశ్వంభర, యాదాద్రి జిల్లా (పుట్టపాక) ప్రతినిధి ఆగస్టు 24 :- అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన లభించింది. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇంచార్జ్ బొల్ల శివశంకర్, నేతృత్వంలో పుట్టపాక అంబేద్కర్ చౌరస్తా నుండి , పద్మశాలి చేనేత భవనం వరకు పద్మశాలి చేనేత ర్యాలీ నిర్వహించి, పద్మశాలీల ఐక్యత ను చాటుకున్నారు... ఈ సందర్భంగా చేనేత విభాగంలో జాతీయ అవార్డులు అందుకున్న చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత వర్గాల కోసం హ్యాండ్లూమ్ బోర్డులు , మార్కెటింగ్ ఇన్సెంటివ్, త్రిబుల్ ఆర్ ,బుంకర్ భీమా యోజన ,ఐసిఐసి ఐ లాంబాడి హెల్త్ స్కీమ్ , వర్క్ షర్ట్స్ ఒంటి ఎన్నో పథకాలను రూపొందించి చేనేతను ఆదుకుందన్నారు ఎప్పుడైతే ఎన్డీఏ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైన పేర్కొన్న పథకాలను రద్దుచేసి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మరియు తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం చేనేతపై జిఎస్టి విధించలేదని ప్రస్తుతం ఉన్న మోడీ సర్కార్ చేనేతలపై జిఎస్టి విధించింది అన్నారు గత ఐదు సంవత్సరాలుగా చేనేత పై విధించిన జీఎస్టీ తొలగించాలని దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఎంతోమంది ఎంపీల ద్వారా పార్లమెంట్లో జిఎస్టి తొలగించాలని వినిపించిన ప్రభుత్వ స్పందించకపోవడం శోచనీయమన్నారు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న పథకాలు బాగున్నాయి కానీ ప్రతిసారి ఎంక్వైరీల పేరుతో చేనేత వృత్తుల వారిని అవమాన పరుస్తున్నారని ఇలాంటి పద్ధతులను వెనక్కి తీసుకోవాలని కోరారు నేతన్న భరోసా పథకం 6 నెలల కాకుండా మూడు నెలలకు ఒకసారి చెల్లింపు చేయాలని కోరారు.
🕒 25 Aug 2025 ✍️ Desk
చేనేత ల కోసం దేశ వ్యాప్త ఉద్యమం చేస్తాం. - గడ్డం జగన్నాధం - ప్రధాన కార్యదర్శి , అఖిల భారత పద్మశాలి సంఘం.
పుట్టపాక లో నేతన్న యాత్ర
విశ్వంభర, యాదాద్రి జిల్లా (పుట్టపాక) ప్రతినిధి ఆగస్టు 24 :- అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన లభించింది. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇంచార్జ్ బొల్ల శివశంకర్, నేతృత్వంలో పుట్టపాక అంబేద్కర్ చౌరస్తా నుండి , పద్మశాలి చేనేత భవనం వరకు పద్మశాలి చేనేత ర్యాలీ నిర్వహించి, పద్మశాలీల ఐక్యత ను చాటుకున్నారు... ఈ సందర్భంగా చేనేత విభాగంలో జాతీయ అవార్డులు అందుకున్న చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత వర్గాల కోసం హ్యాండ్లూమ్ బోర్డులు , మార్కెటింగ్ ఇన్సెంటివ్, త్రిబుల్ ఆర్ ,బుంకర్ భీమా యోజన ,ఐసిఐసి ఐ లాంబాడి హెల్త్ స్కీమ్ , వర్క్ షర్ట్స్ ఒంటి ఎన్నో పథకాలను రూపొందించి చేనేతను ఆదుకుందన్నారు ఎప్పుడైతే ఎన్డీఏ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైన పేర్కొన్న పథకాలను రద్దుచేసి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మరియు తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం చేనేతపై జిఎస్టి విధించలేదని ప్రస్తుతం ఉన్న మోడీ సర్కార్ చేనేతలపై జిఎస్టి విధించింది అన్నారు గత ఐదు సంవత్సరాలుగా చేనేత పై విధించిన జీఎస్టీ తొలగించాలని దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఎంతోమంది ఎంపీల ద్వారా పార్లమెంట్లో జిఎస్టి తొలగించాలని వినిపించిన ప్రభుత్వ స్పందించకపోవడం శోచనీయమన్నారు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న పథకాలు బాగున్నాయి కానీ ప్రతిసారి ఎంక్వైరీల పేరుతో చేనేత వృత్తుల వారిని అవమాన పరుస్తున్నారని ఇలాంటి పద్ధతులను వెనక్కి తీసుకోవాలని కోరారు నేతన్న భరోసా పథకం 6 నెలల కాకుండా మూడు నెలలకు ఒకసారి చెల్లింపు చేయాలని కోరారు.
🔗 https://www.vishvambhara.com/telangana/we-will-make-a-nationwide-movement-for-weavers/article-6190


