రూ.500 కోసం తండ్రిని హత్య చేసిన కన్న కొడుకు
- డబ్బు కోసం తండ్రితో గొడవ.. కత్తితో పొడిచి హత్య
Sangareddy Crime News: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్లో రూ.500 కోసం కన్న తండ్రినే కుమారుడు హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. తుకారం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 కనిపించకపోవడంతో ఆ డబ్బును తన తండ్రే తీసుకున్నాడని అనుమానించాడు. ఈ విషయంపై తండ్రితో తుకారం గొడవకు దిగాడు. తాను డబ్బులు తీసుకోలేదని తండ్రి చెప్పినా తుకారం వినకుండా వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో క్షణికావేశానికి లోనైన తుకారం కత్తితో తండ్రిని పొడిచి హత్య చేసినట్లు సమాచారం. కేవలం రూ.500 కోసం కన్న తండ్రి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
రూ.500 కోసం తండ్రిని హత్య చేసిన కన్న కొడుకు
Sangareddy Crime News: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్లో రూ.500 కోసం కన్న తండ్రినే కుమారుడు హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. తుకారం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 కనిపించకపోవడంతో ఆ డబ్బును తన తండ్రే తీసుకున్నాడని అనుమానించాడు. ఈ విషయంపై తండ్రితో తుకారం గొడవకు దిగాడు. తాను డబ్బులు తీసుకోలేదని తండ్రి చెప్పినా తుకారం వినకుండా వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో క్షణికావేశానికి లోనైన తుకారం కత్తితో తండ్రిని పొడిచి హత్య చేసినట్లు సమాచారం. కేవలం రూ.500 కోసం కన్న తండ్రి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.


