పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో BLOలు.. కలెక్టర్‌ ఓ.ఆనంద్‌

పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో BLOలు.. కలెక్టర్‌ ఓ.ఆనంద్‌

  • ఓటు హక్కు నమోదుకు, మార్పులకు ఇదే అవకాశం.. కలెక్టర్‌ సూచన

Anantapur Collector O Anand:  అనంతపురం, ఆగస్టు 20: ఎస్ఐఆర్‌లో భాగంగా ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ఆగస్టు 22, 23, 29, 30 తేదీలను స్పెషల్‌ క్యాంపెయిన్‌ డేస్‌గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్‌ తెలిపారు. శని, ఆదివారాల్లో నిర్వహించే ఈ ప్రత్యేక ప్రచార దినాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ నాలుగు రోజుల్లో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ (BLO) అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ తెలిపారు. రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్లతో కలిసి BLOలు ప్రజలకు అందుబాటులో ఉండి ఓటర్ల జాబితాలను పరిశీలించడంతో పాటు దరఖాస్తులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు వారి సందేహాలను కూడా నివృత్తి చేస్తారని తెలిపారు.

Read More కార్మికుల ప్రాణాలకు రక్షణ ఏది?.. బిస్మి ఇండస్ట్రీపై రాధాకృష్ణ, కలెక్టర్ స్పందించేదెప్పుడు?

పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలను పరిశీలించేందుకు ప్రజలకు అవకాశం ఉంటుందని కలెక్టర్‌ వెల్లడించారు. అలాగే ASDD (Absent, Shift, Death, Double) జాబితాలకు సంబంధించిన వివరాలు కూడా BLOలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఓటరుగా కొత్తగా నమోదు కావాలనుకునే వారు ఫామ్‌-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు లేదా ఇతర సవరణలు అవసరమైన వారు ఫామ్‌-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

ప్రత్యేక ప్రచార దినాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు, అభ్యంతరాలను నిర్ణీత సమయంలో సమర్పించాలని ఓ.ఆనంద్‌ సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

🕒 20 Aug 2026 ✍️ Desk

పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో BLOలు.. కలెక్టర్‌ ఓ.ఆనంద్‌

Anantapur Collector O Anand:  అనంతపురం, ఆగస్టు 20: ఎస్ఐఆర్‌లో భాగంగా ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ఆగస్టు 22, 23, 29, 30 తేదీలను స్పెషల్‌ క్యాంపెయిన్‌ డేస్‌గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్‌ తెలిపారు. శని, ఆదివారాల్లో నిర్వహించే ఈ ప్రత్యేక ప్రచార దినాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ నాలుగు రోజుల్లో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ (BLO) అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ తెలిపారు. రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్లతో కలిసి BLOలు ప్రజలకు అందుబాటులో ఉండి ఓటర్ల జాబితాలను పరిశీలించడంతో పాటు దరఖాస్తులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు వారి సందేహాలను కూడా నివృత్తి చేస్తారని తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలను పరిశీలించేందుకు ప్రజలకు అవకాశం ఉంటుందని కలెక్టర్‌ వెల్లడించారు. అలాగే ASDD (Absent, Shift, Death, Double) జాబితాలకు సంబంధించిన వివరాలు కూడా BLOలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఓటరుగా కొత్తగా నమోదు కావాలనుకునే వారు ఫామ్‌-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు లేదా ఇతర సవరణలు అవసరమైన వారు ఫామ్‌-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

ప్రత్యేక ప్రచార దినాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు, అభ్యంతరాలను నిర్ణీత సమయంలో సమర్పించాలని ఓ.ఆనంద్‌ సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/blos-available-in-polling-centers-collector-oanand/article-21910

Tags: