ఐఫోన్ కోసం తాతను చంపించిన 13 ఏళ్ల బాలిక.. సమాజం ఎటువైపు వెళ్తోంది?
ఐఫోన్ కోసం తాతనే చంపించింది.. యువత ఆలోచనా విధానంపై ప్రశ్నలు
Kerala Crime: కేరళలోని అలప్పుజలో చోటుచేసుకున్న దారుణ ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఐఫోన్ కోసం ఓ 13 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి 67 ఏళ్ల తాతను హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాయ్ఫ్రెండ్తో పాటు మరో ఇద్దరు బాలుర సహాయంతో వృద్ధుడిని హత్య చేయించి, ఇంట్లో ఉన్న సుమారు నాలుగు తులాల బంగారాన్ని దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ బంగారాన్ని విక్రయించి వచ్చిన డబ్బుతో తనకు ఐఫోన్, ప్రియుడికి బైక్ కొనాలని బాలిక ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
గతంలో తాత తనతో దురుసుగా ప్రవర్తించాడని బాలిక తన ప్రియుడికి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం తాతను హత్య చేయాలని ప్రియుడితో కలిసి బాలిక పథకం వేసినట్లు తెలిపారు. పథకం ప్రకారం ఇద్దరు బాలురు వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించగా, మరో బాలుడు మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. వృద్ధుడిని కట్టేసి తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు. హత్య జరుగుతున్న సమయంలో బాలికకు వీడియో కాల్ ద్వారా చూపించినట్లు పోలీసులు తెలిపారు.
ఒక చిన్నారి మనసులో ఐఫోన్పై ఇంతటి మోజు ఎలా పెరిగింది? వస్తువులపై మమకారం మనుషుల ప్రాణాల కంటే ఎక్కువైపోతుందా? అనే ప్రశ్నలు ఈ ఘటనతో తీవ్రంగా వినిపిస్తున్నాయి. చేతిలో ఉండే ఒక ఫోన్ కోసం జీవితాంతం ప్రేమను పంచిన కుటుంబ సభ్యుడి ప్రాణాన్ని తీయడం సమాజంలో పెరుగుతున్న విలువల సంక్షోభాన్ని ఆలోచింపజేస్తోంది. పిల్లలకు ఖరీదైన వస్తువులు ఇవ్వడం కంటే వాటి విలువ, బాధ్యత, మానవ సంబంధాల ప్రాధాన్యతను నేర్పాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. నిందితురాలిని అదుపులోకి తీసుకుని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ઘટનపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఐఫోన్ కోసం తాతను చంపించిన 13 ఏళ్ల బాలిక.. సమాజం ఎటువైపు వెళ్తోంది?
Kerala Crime: కేరళలోని అలప్పుజలో చోటుచేసుకున్న దారుణ ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఐఫోన్ కోసం ఓ 13 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి 67 ఏళ్ల తాతను హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాయ్ఫ్రెండ్తో పాటు మరో ఇద్దరు బాలుర సహాయంతో వృద్ధుడిని హత్య చేయించి, ఇంట్లో ఉన్న సుమారు నాలుగు తులాల బంగారాన్ని దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ బంగారాన్ని విక్రయించి వచ్చిన డబ్బుతో తనకు ఐఫోన్, ప్రియుడికి బైక్ కొనాలని బాలిక ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
గతంలో తాత తనతో దురుసుగా ప్రవర్తించాడని బాలిక తన ప్రియుడికి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం తాతను హత్య చేయాలని ప్రియుడితో కలిసి బాలిక పథకం వేసినట్లు తెలిపారు. పథకం ప్రకారం ఇద్దరు బాలురు వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించగా, మరో బాలుడు మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. వృద్ధుడిని కట్టేసి తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు. హత్య జరుగుతున్న సమయంలో బాలికకు వీడియో కాల్ ద్వారా చూపించినట్లు పోలీసులు తెలిపారు.
ఒక చిన్నారి మనసులో ఐఫోన్పై ఇంతటి మోజు ఎలా పెరిగింది? వస్తువులపై మమకారం మనుషుల ప్రాణాల కంటే ఎక్కువైపోతుందా? అనే ప్రశ్నలు ఈ ఘటనతో తీవ్రంగా వినిపిస్తున్నాయి. చేతిలో ఉండే ఒక ఫోన్ కోసం జీవితాంతం ప్రేమను పంచిన కుటుంబ సభ్యుడి ప్రాణాన్ని తీయడం సమాజంలో పెరుగుతున్న విలువల సంక్షోభాన్ని ఆలోచింపజేస్తోంది. పిల్లలకు ఖరీదైన వస్తువులు ఇవ్వడం కంటే వాటి విలువ, బాధ్యత, మానవ సంబంధాల ప్రాధాన్యతను నేర్పాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. నిందితురాలిని అదుపులోకి తీసుకుని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ઘટનపై దర్యాప్తు కొనసాగుతోంది.


