దారి కోసం రైతుపై ఒత్తిడి.. ఎస్సై, ఎమ్మార్వో ముందే శివయ్య ఆత్మహత్యాయత్నం

దారి కోసం రైతుపై ఒత్తిడి.. ఎస్సై, ఎమ్మార్వో ముందే శివయ్య ఆత్మహత్యాయత్నం

  • రాజకీయ అండతో రైతుపై అధికారుల దౌర్జన్యం.. ఉన్నతాధికారులకు బాధితుల ఫిర్యాదు

Anantapuram Farmer Suicide Attempt: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం సంజీవపురం గ్రామానికి చెందిన రైతు శివయ్య పట్టా భూమిలో దారి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన పట్టా భూమిలో దారి కోసం గార్లదిన్నె ఎస్సై, ఎమ్మార్వో అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని, దారి ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారని రైతు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక ఎస్సై, ఎమ్మార్వో సమక్షంలోనే శివయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వెంటనే ఆయనను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Read More 8 ఏళ్ళైనా నష్ట పరిహారం లేదు

ఎస్సై , ఎమ్మార్వో ముందే శివయ్య ఆత్మహత్యాయత్నం 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

రైతులకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు తమపై ఒత్తిడి తీసుకురావడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని శివయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టా భూమిలో దారి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేశారని, దారి ఇవ్వకపోతే కేసులు పెడతామని హెచ్చరించారని చెప్పారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుల అండదండలతోనే అధికారులు రైతుపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కేసు నమోదు చేయలేదని, దుర్భాషలాడి వెనక్కి పంపించారని వారు తెలిపారు.

తమ పొలంలోనే తమపై దాడి చేసి తాళిబొట్లు తెంపిన ఘటనను కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని రైతు బంధువులు తెలిపారు. అయినప్పటికీ కేసు నమోదు చేయకుండా తమను తిట్టి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు శివయ్య ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్వో, ఎస్సై వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతు శివయ్యకు ఏదైనా జరిగితే ఎమ్మార్వో, ఎస్సైలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. పట్టా భూమి దారి వివాదాన్ని వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

 

🕒 20 Aug 2026 ✍️ Desk

దారి కోసం రైతుపై ఒత్తిడి.. ఎస్సై, ఎమ్మార్వో ముందే శివయ్య ఆత్మహత్యాయత్నం

Anantapuram Farmer Suicide Attempt: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం సంజీవపురం గ్రామానికి చెందిన రైతు శివయ్య పట్టా భూమిలో దారి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన పట్టా భూమిలో దారి కోసం గార్లదిన్నె ఎస్సై, ఎమ్మార్వో అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని, దారి ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారని రైతు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక ఎస్సై, ఎమ్మార్వో సమక్షంలోనే శివయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వెంటనే ఆయనను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

ఎస్సై , ఎమ్మార్వో ముందే శివయ్య ఆత్మహత్యాయత్నం 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

రైతులకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు తమపై ఒత్తిడి తీసుకురావడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని శివయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టా భూమిలో దారి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేశారని, దారి ఇవ్వకపోతే కేసులు పెడతామని హెచ్చరించారని చెప్పారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుల అండదండలతోనే అధికారులు రైతుపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కేసు నమోదు చేయలేదని, దుర్భాషలాడి వెనక్కి పంపించారని వారు తెలిపారు.

తమ పొలంలోనే తమపై దాడి చేసి తాళిబొట్లు తెంపిన ఘటనను కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని రైతు బంధువులు తెలిపారు. అయినప్పటికీ కేసు నమోదు చేయకుండా తమను తిట్టి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు శివయ్య ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్వో, ఎస్సై వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతు శివయ్యకు ఏదైనా జరిగితే ఎమ్మార్వో, ఎస్సైలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. పట్టా భూమి దారి వివాదాన్ని వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

 

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/shivayya-tried-to-commit-suicide-in-front-of-the-ssi/article-21872