యాదాద్రి ఫార్మాలో పేలిన రియాక్టర్.. 10 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- యాదాద్రి ఫార్మా కంపెనీలో పేలుడు.. ప్రమాదంపై అధికారుల విచారణ
Yadadri Heji Pharma: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో హెజీలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి కంపెనీ పరిసరాల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, హెజీలోని ఫార్మా కంపెనీలో మూడు నెలల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం కావడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రమాదాలపై కార్మికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
యాదాద్రి ఫార్మాలో పేలిన రియాక్టర్.. 10 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
Yadadri Heji Pharma: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో హెజీలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి కంపెనీ పరిసరాల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, హెజీలోని ఫార్మా కంపెనీలో మూడు నెలల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం కావడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రమాదాలపై కార్మికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.


