నువ్వు సీఎంవా.. ఆయన సీఎంవా? రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత ఫైర్
రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలు
Konda Susmitha: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఉన్న పొంగు ఎక్కువ సేపు పొంగదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఎవరో, మరొకరు ఎవరో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికార వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఇటీవల హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ఇతర నేతల ఫొటోలు ఏర్పాటు చేశారని కొండా సుస్మిత పేర్కొన్నారు. అయితే హైదరాబాద్కు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఫొటో మాత్రం పెట్టలేదని ఆమె విమర్శించారు. ఇంచార్జ్ మంత్రికి సంబంధించిన ప్రాధాన్యతను పక్కన పెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ఫొటోను ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ఏర్పాటు చేయకపోవడంపై కొండా సుస్మిత తీవ్రంగా స్పందించారు. బీసీలు అంటే ప్రభుత్వానికి అంత చులకనా అంటూ ప్రశ్నించారు. బీసీలకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తమ పోరాటం కొనసాగుతుందని కొండా సుస్మిత స్పష్టం చేశారు.
నువ్వు సీఎంవా.. ఆయన సీఎంవా? రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత ఫైర్
Konda Susmitha: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఉన్న పొంగు ఎక్కువ సేపు పొంగదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఎవరో, మరొకరు ఎవరో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికార వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఇటీవల హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ఇతర నేతల ఫొటోలు ఏర్పాటు చేశారని కొండా సుస్మిత పేర్కొన్నారు. అయితే హైదరాబాద్కు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఫొటో మాత్రం పెట్టలేదని ఆమె విమర్శించారు. ఇంచార్జ్ మంత్రికి సంబంధించిన ప్రాధాన్యతను పక్కన పెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ఫొటోను ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ఏర్పాటు చేయకపోవడంపై కొండా సుస్మిత తీవ్రంగా స్పందించారు. బీసీలు అంటే ప్రభుత్వానికి అంత చులకనా అంటూ ప్రశ్నించారు. బీసీలకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తమ పోరాటం కొనసాగుతుందని కొండా సుస్మిత స్పష్టం చేశారు.


