నేలపై కూర్చుని వైసీపీ ఎమ్మెల్సీల నిరసన.. డీఎస్సీపై చర్చకు డిమాండ్
- నారా లోకేష్ రాజీనామా చేయాలి.. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల నినాదాలు
Andhra Pradesh Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన ఉధృతమైంది. డీఎస్సీ అక్రమాలపై వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో నేలపై కూర్చుని నిరసన చేపట్టారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఈ అంశంపై సభలో చర్చకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. సభ వాయిదా పడినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీలు తమ ఆందోళనను కొనసాగించారు. డీఎస్సీ అక్రమాలపై చర్చ జరిగే వరకు తమ నిరసన కొనసాగుతుందని ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.
నేలపై కూర్చుని వైసీపీ ఎమ్మెల్సీల నిరసన.. డీఎస్సీపై చర్చకు డిమాండ్
Andhra Pradesh Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన ఉధృతమైంది. డీఎస్సీ అక్రమాలపై వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో నేలపై కూర్చుని నిరసన చేపట్టారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఈ అంశంపై సభలో చర్చకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. సభ వాయిదా పడినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీలు తమ ఆందోళనను కొనసాగించారు. డీఎస్సీ అక్రమాలపై చర్చ జరిగే వరకు తమ నిరసన కొనసాగుతుందని ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.


