ఏపీలో SIR గడువు పొడిగింపు.. ఓటర్లకు మరో అవకాశం

ఏపీలో SIR గడువు పొడిగింపు.. ఓటర్లకు మరో అవకాశం

  • ఏపీ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం.. గడువు పొడిగింపు

Andhra Pradesh SIR: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గడువును పొడిగిస్తూ నిర్ణయించింది. ఇప్పటివరకు కొనసాగుతున్న SIR ప్రక్రియను ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలిపింది. దీంతో ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన ప్రక్రియకు మరింత సమయం లభించనుంది.

SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి అందే క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించేందుకు కూడా ఎస్ఈసీ అదనపు గడువు ఇచ్చింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నా.. లేదా మార్పులు, చేర్పులు అవసరమైనా సంబంధిత ప్రక్రియలో వాటిని తెలియజేసే అవకాశం ఉంటుంది.

Read More హత్య చేసిన వారంలోపే నిందితుడి ఆటకట్టించిన అనంతపురం వన్ టౌన్ సీఐ టీమ్

SIR ప్రక్రియ, క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిశీలన పూర్తైన అనంతరం అక్టోబర్ 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. గడువు పొడిగింపుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు మరింత సమయం లభించనుంది. తుది జాబితా విడుదలకు ముందు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Related Posts