దుర్గం చెరువులో మళ్లీ చేపల మృతి.. అధికారుల చర్యలపై యువతి ప్రశ్న
- దుర్గం చెరువులో చేపల మృతి.. శాశ్వత పరిష్కారం ఎప్పుడంటున్న యువతి
Durgam Cheruvu Fish Deaths: దుర్గం చెరువులో మళ్లీ చేపలు చనిపోతున్నాయి. చెరువులోని నీటిపై పెద్ద సంఖ్యలో చనిపోయిన చేపలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. అవి క్రమంగా ఒడ్డుకు చేరడంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడే జరిగిన ఘటన కాదని.. 2025లో కూడా దుర్గం చెరువులో ఇదే విధంగా చేపలు మృతి చెందాయని ఓ యువతి గుర్తుచేస్తోంది. అప్పట్లో అధికారులు కొద్దిరోజులు హడావుడి చేసి చేపల మృతికి కారణాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆమె పేర్కొంది. కానీ ఈసారి కూడా మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తుండటంతో అప్పటి చర్యలు ఏ మేరకు ఫలించాయనే ప్రశ్న తలెత్తుతోందని అంటోంది.
చేపలు ఎందుకు చనిపోతున్నాయో అసలు కారణాలను అధికారులు పూర్తిస్థాయిలో గుర్తించాల్సిన అవసరం ఉందని యువతి కోరుతోంది. ప్రతిసారి చేపలు చనిపోయిన తర్వాత అధికారులు హడావుడి చేయడం కాకుండా.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చెబుతోంది. చెరువులో నీటి నాణ్యత, కాలుష్యం వంటి అంశాలను పరిశీలించి చేపల మృతికి గల కారణాలను అధికారులు గుర్తించాలని యువతి కోరుతోంది.
గతంలో జరిగిన ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని.. ఈసారి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటోంది. గతేడాది ఘటన తర్వాత అధికారులు చేపట్టిన చర్యలు ఏంటి? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? మళ్లీ ఇదే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే విషయాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని యువతి కోరుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కారణాలను గుర్తించి, భవిష్యత్తులో దుర్గం చెరువులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటారా అనేది చూడాలని అంటోంది.



