పదవుల కోసం కాదు.. సమాజం, దేశం కోసం జనసైనికుల ప్రయాణం: నాదెండ్ల

పదవుల కోసం కాదు.. సమాజం, దేశం కోసం జనసైనికుల ప్రయాణం: నాదెండ్ల

  • బైక్‌పై వచ్చి పవన్‌ టాటూ చూపిస్తారు.. జనసైనికుల అభిమానాన్ని వివరించిన నాదెండ్ల

Nadendla Manohar: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై జనసైనికులకు ఉన్న అభిమానాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వివరించారు. తాను రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో బైక్‌లపై వచ్చే యువకులు పలకరించి జనసేనకు సంబంధించిన సంకేతాలు చూపిస్తారని చెప్పారు. ఆ తర్వాత షర్ట్‌ తీసి పవన్‌ కల్యాణ్‌, జనసేన పేరుతో వేయించుకున్న టాటూలను చూపిస్తుంటారని తెలిపారు.

అలాంటి సందర్భాల్లో తాను వాహనం అద్దం దించి ‘బాబు కాస్త జాగ్రత్తగా తోలండి’ అని చెబితే.. వారు ‘మా అన్నయ్యను జాగ్రత్తగా చూసుకో అన్నా’ అని సమాధానం ఇస్తారని నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. పవన్‌ కల్యాణ్‌పై జనసైనికులకు ఉన్న అభిమానానికి, ఆప్యాయతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వారి మాటల్లో పవన్‌ పట్ల ఉన్న గౌరవం, ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా భావించే అనుబంధం కనిపిస్తుందని అన్నారు.

Read More ఎస్కేయూ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు: త్వరలో 100 మంది టీచింగ్ ఫ్యాకల్టీ నియామకం

జనసైనికులు పదవుల కోసం ఈ ప్రయాణం చేయడం లేదని, నాయకత్వం కోసం మాత్రమే ముందుకు సాగడం లేదని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సమాజం, దేశం కోసం పనిచేయాలనే ఆలోచనతోనే వారు పార్టీతో కలిసి ప్రయాణిస్తున్నారని చెప్పారు. జనసేన బాగుండాలని, పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కార్యకర్తలు ఎంతో తపనతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.