వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు రూ.లక్ష విరాళం.. ఆలం వెంకట నరసానాయుడు

వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు రూ.లక్ష విరాళం.. ఆలం వెంకట నరసానాయుడు

  • బొందలవాడ వాల్మీకి విగ్రహానికి భారీ విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

Anantapur News: అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయడానికి వెంకట్‌ వకుల ఫౌండేషన్‌ చైర్మన్‌ ఆలం వెంకట నరసానాయుడు చేయూత అందించారు. వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు రూ.1,00,000 విరాళంగా అందజేశారు. అంతేకాకుండా విగ్రహం కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని కూడా తానే భరిస్తానని ఆలం వెంకట నరసానాయుడు తెలిపారు.

గ్రామంలో వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమానికి తన వంతు సహకారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటుకు రూ.లక్ష అందించడంతో పాటు విగ్రహం కొనుగోలు ఖర్చును కూడా భరిస్తానని చెప్పడంతో గ్రామంలోని వాల్మీకి సోదరులు హర్షం వ్యక్తం చేశారు.

Read More బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఎదుట యువతి రీల్స్.. వైరల్ వీడియో

వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన ఆలం వెంకట నరసానాయుడికి వాల్మీకి సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి ఆయన అందించిన సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

Tags: