గుంటూరులో మహిళా కాంట్రాక్టర్‌పై కత్తులతో దాడి

గుంటూరులో మహిళా కాంట్రాక్టర్‌పై కత్తులతో దాడి

  • గుంటూరులో మహిళా కాంట్రాక్టర్‌పై దాడి.. నిందితుల కోసం పోలీసుల దర్యాప్తు

Guntur Crime: గుంటూరులో మహిళా కాంట్రాక్టర్‌పై కత్తులు, రాళ్లతో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. గోరంట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విద్యాసంస్థలు, హాస్టళ్లలో హౌస్‌కీపింగ్‌ కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్న సునీతపై ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో రక్తగాయాలతో ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తనకు జరిగిన ఘటనను వివరించారు.

కాంట్రాక్ట్‌ పనులు వదిలేయాలంటూ మరో కాంట్రాక్టర్‌ శివ అనుచరులు తనపై దాడి చేసినట్లు సునీత ఆరోపించారు. రాళ్లు, కత్తులతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా దాడి జరగడంతో బాధితురాలు భయాందోళనకు గురయ్యారు. గాయాలతో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆమె నుంచి పోలీసులు వివరాలు తెలుసుకున్నారు.

Read More పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ళు జైలు 

సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని వెంటనే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్‌)కు తరలించి చికిత్స అందించారు. కాంట్రాక్ట్‌ పనుల విషయంలో ఏర్పడిన వివాదమే దాడికి కారణమా, ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Related Posts