కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన టీజేఏ జిల్లా నూతన కమిటీ
విద్యార్థులు, మహబూబాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీ సభ్యులు శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు . ఈ సందర్భంగా టిజేఎ యూనియన్ జిల్లా అధ్యక్షులు మేకరబోయిన నాగేశ్వర్ యూనియన్ లోని అంశాలపై కలెక్టర్ కు వివరించగా సంబంధిత శాఖ అధికారిని సంప్రదించమని తెలిపారు. అనంతరం జిల్లా సమాచార, ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) రాజేంద్ర ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా డిపిఆర్ఓ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీజేఏ మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీని టీజేఏ ఫౌండర్, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర నాయకత్వం జిల్లా కమిటీని ప్రకటించారు. టీజేఏ జిల్లా అధ్యక్షుడిగా మేకరబోయిన నాగేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇండ్ల మహేష్, ఉపాధ్యక్షుడిగా ఎర్ర మురళి, కార్యదర్శిగా గుగులోతు రమేష్, జిల్లా కోశాధికారిగా జక్కుల మురళి, కమిటీ సభ్యులుగా గాడిపల్లి సందీప్, పొన్నబోయిన వెంకన్న, గుగులోతు నరేష్, బూరుగు శ్రీకాంత్ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం టీజేఏ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రక్రియలో సహకరించిన టీజేఏ ఫౌండర్, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రమణరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘోరీలకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమ కోసం టీజేఏ యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎండి జాకీర్ హుస్సేన్, జినుక శేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన టీజేఏ జిల్లా నూతన కమిటీ
విద్యార్థులు, మహబూబాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీ సభ్యులు శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు . ఈ సందర్భంగా టిజేఎ యూనియన్ జిల్లా అధ్యక్షులు మేకరబోయిన నాగేశ్వర్ యూనియన్ లోని అంశాలపై కలెక్టర్ కు వివరించగా సంబంధిత శాఖ అధికారిని సంప్రదించమని తెలిపారు. అనంతరం జిల్లా సమాచార, ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) రాజేంద్ర ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా డిపిఆర్ఓ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీజేఏ మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీని టీజేఏ ఫౌండర్, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర నాయకత్వం జిల్లా కమిటీని ప్రకటించారు. టీజేఏ జిల్లా అధ్యక్షుడిగా మేకరబోయిన నాగేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇండ్ల మహేష్, ఉపాధ్యక్షుడిగా ఎర్ర మురళి, కార్యదర్శిగా గుగులోతు రమేష్, జిల్లా కోశాధికారిగా జక్కుల మురళి, కమిటీ సభ్యులుగా గాడిపల్లి సందీప్, పొన్నబోయిన వెంకన్న, గుగులోతు నరేష్, బూరుగు శ్రీకాంత్ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం టీజేఏ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రక్రియలో సహకరించిన టీజేఏ ఫౌండర్, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రమణరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘోరీలకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమ కోసం టీజేఏ యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎండి జాకీర్ హుస్సేన్, జినుక శేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు.


