ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : - భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, గణపురం మండలం చెల్పూర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జ్వర
సర్వే ప్రక్రియపై ప్రతిరోజు తనకు నివేదికలు అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపి రిజిస్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి ఎలాంటి వ్యాధులతో బాధపడే వైద్య సేవలకు వస్తున్నారని, వైద్య సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు మొత్తం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరంతరాయ వర్షాలు వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వర సర్వే ముమ్మరంగా చేయాలని అన్నారు. జ్వర సర్వే వివరాలు పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. పాము వంటి విష జంతవుల వ్యాక్సిన్, అత్యవసర మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహాదేవపూర్, మహా ముత్తారాం, కాటారం, పలిమెల మండలాల్లో ఎన్ సి డి సర్వే (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెష్) చేయాలని తెలిపారు. జ్వరాలు ప్రబలే గ్రామాల్లో అత్యవసర వైద్య సేవల క్యాంపులు నిర్వహించి వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య క్యాంపులు నిర్వహణపై ప్రజలకు సమాచారం తెలిసేలా ముందస్తుగా ఆయా గ్రామాల్లో టాం .. టాం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. మహాదేవపూర్ ఆసుపత్రిలో ప్రసూతి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రసూతి వైద్యాధికారి నియామకానికి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. 
ఆసుపత్రుల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్పోరేట్ ఆసుపత్రుల సమన్వయంతో జిల్లాలో మెగా ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, ఉప వైద్యాధికారి డా కొమరయ్య,
డా చిరంజీవి, ప్రోగ్రాం అధికారులు శ్రీదేవి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : - భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, గణపురం మండలం చెల్పూర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జ్వర
సర్వే ప్రక్రియపై ప్రతిరోజు తనకు నివేదికలు అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపి రిజిస్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి ఎలాంటి వ్యాధులతో బాధపడే వైద్య సేవలకు వస్తున్నారని, వైద్య సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు మొత్తం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరంతరాయ వర్షాలు వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వర సర్వే ముమ్మరంగా చేయాలని అన్నారు. జ్వర సర్వే వివరాలు పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. పాము వంటి విష జంతవుల వ్యాక్సిన్, అత్యవసర మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహాదేవపూర్, మహా ముత్తారాం, కాటారం, పలిమెల మండలాల్లో ఎన్ సి డి సర్వే (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెష్) చేయాలని తెలిపారు. జ్వరాలు ప్రబలే గ్రామాల్లో అత్యవసర వైద్య సేవల క్యాంపులు నిర్వహించి వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య క్యాంపులు నిర్వహణపై ప్రజలకు సమాచారం తెలిసేలా ముందస్తుగా ఆయా గ్రామాల్లో టాం .. టాం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. మహాదేవపూర్ ఆసుపత్రిలో ప్రసూతి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రసూతి వైద్యాధికారి నియామకానికి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. 
ఆసుపత్రుల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్పోరేట్ ఆసుపత్రుల సమన్వయంతో జిల్లాలో మెగా ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, ఉప వైద్యాధికారి డా కొమరయ్య,
డా చిరంజీవి, ప్రోగ్రాం అధికారులు శ్రీదేవి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.


