పోతరాజు సోమ విజయ్ కుమార్ ముదిరాజ్ ను సన్మానించిన ఎమ్మెల్యే రాజా సింగ్
విశ్వంభర, బషీర్ బాగ్: తెలంగాణ సాంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని శాసనసభ సభ్యులు రాజాసింగ్ అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాజాసింగ్ నివాసంలోని కాన్ఫరెన్స్ హాలులో గత 33 సంవత్సరాలుగా నిర్విరామంగా గోల్కొండ, సుల్తాన్ సాయి, గౌలిపుర దేవాలయాలలో వివిధ జిల్లాలలో పాటు పాత నగరంలో బోనాల పండుగను పురస్కరించుకొని పోతరాజుగా వేశాన్ని నిత్యం ధరిస్తున్న సోమ విజయ్ కుమార్ ముదిరాజ్ ను శాసనసభ సభ్యులు టి.రాజాసింగ్ శాలువా, జ్ఞాపిక పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ ఆషాడ మాసం అమ్మవారి బోనాల పండుగ జాతరను హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించి జాతర ఊరేగింపు ఉత్సవాలను సోదర భావంతో ఐక్యంగా ఉత్సాహంగా జరుపుకోవాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమ విజయకుమార్ పోతురాజు మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా పోతరాజుగా కళ్ళను గుర్తించి నన్ను సన్మానిస్తున్న అందుకు రాజా సింగ్ తెలంగాణ మేధావుల పురం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా బోనాల పండుగను పురస్కరించుకొని గోల్కొండ ఎల్లమ్మ తల్లి, అమ్మవారి గౌలిపుర కోట మైసమ్మ దీవెనలతో అన్న ప్రసాద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నానని విజయ్ పోతురాజు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ శాసనసభ సభ్యులు శ టి.రాజాసింగ్ ను శాలువా, జ్ఞాపిక, పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందించారు .ఈ కార్యక్రమంలో టిసిసి రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు కె .రవీందర్, కోఆర్డినేటర్లు జి. వేణుగోపాల్, బిచ్చుకారి సూర్య, మహేష్ ,సాయిరాం, జగదీష్ చారి, హర్ష యాదవ్ తదితరులు పోతరాజు సోమ విజయకుమార్ కు ఈ సందర్భంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
పోతరాజు సోమ విజయ్ కుమార్ ముదిరాజ్ ను సన్మానించిన ఎమ్మెల్యే రాజా సింగ్
విశ్వంభర, బషీర్ బాగ్: తెలంగాణ సాంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని శాసనసభ సభ్యులు రాజాసింగ్ అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాజాసింగ్ నివాసంలోని కాన్ఫరెన్స్ హాలులో గత 33 సంవత్సరాలుగా నిర్విరామంగా గోల్కొండ, సుల్తాన్ సాయి, గౌలిపుర దేవాలయాలలో వివిధ జిల్లాలలో పాటు పాత నగరంలో బోనాల పండుగను పురస్కరించుకొని పోతరాజుగా వేశాన్ని నిత్యం ధరిస్తున్న సోమ విజయ్ కుమార్ ముదిరాజ్ ను శాసనసభ సభ్యులు టి.రాజాసింగ్ శాలువా, జ్ఞాపిక పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ ఆషాడ మాసం అమ్మవారి బోనాల పండుగ జాతరను హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించి జాతర ఊరేగింపు ఉత్సవాలను సోదర భావంతో ఐక్యంగా ఉత్సాహంగా జరుపుకోవాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమ విజయకుమార్ పోతురాజు మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా పోతరాజుగా కళ్ళను గుర్తించి నన్ను సన్మానిస్తున్న అందుకు రాజా సింగ్ తెలంగాణ మేధావుల పురం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా బోనాల పండుగను పురస్కరించుకొని గోల్కొండ ఎల్లమ్మ తల్లి, అమ్మవారి గౌలిపుర కోట మైసమ్మ దీవెనలతో అన్న ప్రసాద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నానని విజయ్ పోతురాజు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ శాసనసభ సభ్యులు శ టి.రాజాసింగ్ ను శాలువా, జ్ఞాపిక, పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందించారు .ఈ కార్యక్రమంలో టిసిసి రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు కె .రవీందర్, కోఆర్డినేటర్లు జి. వేణుగోపాల్, బిచ్చుకారి సూర్య, మహేష్ ,సాయిరాం, జగదీష్ చారి, హర్ష యాదవ్ తదితరులు పోతరాజు సోమ విజయకుమార్ కు ఈ సందర్భంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.


