జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామ పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో 6వ, 7వ, 8వ తరగతులలో 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల కొరకు అర్హత కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కే.నాగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. చివరి తేదీ ఆగస్టు మూడో తారీకు సాయంత్రం ఐదు గంటల వరకు అని, దరఖాస్తు చేయదలచిన వారు రెండు పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, బోనఫైడ్ జిరాక్స్, దరఖాస్తు ఫారంతో జత చేసి జనంపల్లి గ్రామ పరిధిలోని గురుకుల పాఠశాల నందు అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆగస్టు 5వ తేదీన అభ్యర్థులకు జనంపల్లి గురుకుల పాఠశాల నందు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా మిగిలిన సీట్లను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామ పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో 6వ, 7వ, 8వ తరగతులలో 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల కొరకు అర్హత కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కే.నాగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. చివరి తేదీ ఆగస్టు మూడో తారీకు సాయంత్రం ఐదు గంటల వరకు అని, దరఖాస్తు చేయదలచిన వారు రెండు పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, బోనఫైడ్ జిరాక్స్, దరఖాస్తు ఫారంతో జత చేసి జనంపల్లి గ్రామ పరిధిలోని గురుకుల పాఠశాల నందు అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆగస్టు 5వ తేదీన అభ్యర్థులకు జనంపల్లి గురుకుల పాఠశాల నందు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా మిగిలిన సీట్లను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.


