ఈ 20 విధానం ప్రజలపై బలవంతంగా రుద్ద వద్దు : డాక్టర్ దిడ్డి సుధాకర్
విశ్వంభర, బషీర్ బాగ్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ 20 ( ఎథనాల్ మిశ్రమ పెట్రోల్) విధానం నిజంగా దేశ ప్రయోజనాల కోసమా, లేక కొందరి కార్పొరేట్ వ్యాపార ప్రయోజనాల కోసమా అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సలహాదారు, ప్రధాన అధికార ప్రతినిధి డా. దిడ్డి సుధాకర్ ప్రశ్నించారు. ప్రజల వాహనాల భద్రత, కోట్లాది మంది వాహనదారుల ఆర్థిక భారం, ఇంజిన్ పనితీరు, నిర్వహణ వ్యయం, మైలేజ్, పర్యావరణ ప్రభావం వంటి కీలక అంశాలపై సమగ్ర శాస్త్రీయ ఆధారాలను వెల్లడించకుండా ఈ 20 విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రేపు దేశ ప్రజలను ఉద్దేశించి ఈ 20 విధానంపై ప్రత్యక్షంగా మాట్లాడనున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ 20 విధానం ప్రజలపై బలవంతంగా రుద్ద వద్దు : డాక్టర్ దిడ్డి సుధాకర్
విశ్వంభర, బషీర్ బాగ్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ 20 ( ఎథనాల్ మిశ్రమ పెట్రోల్) విధానం నిజంగా దేశ ప్రయోజనాల కోసమా, లేక కొందరి కార్పొరేట్ వ్యాపార ప్రయోజనాల కోసమా అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సలహాదారు, ప్రధాన అధికార ప్రతినిధి డా. దిడ్డి సుధాకర్ ప్రశ్నించారు. ప్రజల వాహనాల భద్రత, కోట్లాది మంది వాహనదారుల ఆర్థిక భారం, ఇంజిన్ పనితీరు, నిర్వహణ వ్యయం, మైలేజ్, పర్యావరణ ప్రభావం వంటి కీలక అంశాలపై సమగ్ర శాస్త్రీయ ఆధారాలను వెల్లడించకుండా ఈ 20 విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రేపు దేశ ప్రజలను ఉద్దేశించి ఈ 20 విధానంపై ప్రత్యక్షంగా మాట్లాడనున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


