బిహార్‌లో ఘోర ప్రమాదం.. క్షణాల్లో గంగలో మునిగిన పడవ

బిహార్‌లో ఘోర ప్రమాదం.. క్షణాల్లో గంగలో మునిగిన పడవ

  • రఘోపూర్‌లో ఒక్కసారిగా పెరిగిన నీటిమట్టం.. గంగలో మునిగిన పడవ

 

Bihar Boat Accident: బిహార్‌లోని భగల్‌పూర్‌ జిల్లా రఘోపూర్‌ ప్రాంతంలో గంగానదిలో పడవ ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో పడవ క్షణాల్లోనే గంగలో మునిగిపోయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో పడవలో ఉన్న పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.

Read More వందేమాతరం చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. అమల్లోకి కొత్త నిబంధనలు

సమాచారం అందుకున్న వెంటనే NDRF బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గంగలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహం, ఒక్కసారిగా పెరిగిన నీటిమట్టం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గల్లంతైన వారి సంఖ్య, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల నుంచి వెల్లడికావాల్సి ఉంది.

Related Posts