హైదరాబాద్–విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
- దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మందికి తీవ్ర గాయాలు
Hyderabad Vijayawada Highway: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
బస్సు కంటైనర్ను బలంగా ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై అధికారులు మరింత సమాచారం వెల్లడించాల్సి ఉంది.
హైదరాబాద్–విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
Hyderabad Vijayawada Highway: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
బస్సు కంటైనర్ను బలంగా ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై అధికారులు మరింత సమాచారం వెల్లడించాల్సి ఉంది.


