‘వందేమాతరం’ వివాదంపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓవైసీ
- యువత రోడ్లపైకి వచ్చేలా చేస్తున్నారంటూ ఓవైసీ విమర్శలు
Asaduddin Owaisi: ‘వందేమాతరం’ వివాదంపై హైదరాబాద్ ఎంపీ, AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశ్నలు సంధించారు. మహాత్మా గాంధీ కంటే మోదీ ఎక్కువ తెలివైనవారా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ కంటే మోదీ దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా? రవీంద్రనాథ్ టాగోర్ కంటే మోదీ ఎక్కువ మేధావా? అంటూ ప్రశ్నించారు. ‘వందేమాతరం’ అంశాన్ని ప్రస్తావిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన సమయంలో వారిని ఇతర అంశాల వైపు మళ్లిస్తున్నారని ఓవైసీ విమర్శించారు. ఉద్యోగాల కోసం యువత రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ‘వందేమాతరం’పై తన అభిప్రాయాలను గతంలోనూ ఓవైసీ వెల్లడించారు.
‘వందేమాతరం’ వివాదంపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓవైసీ
Asaduddin Owaisi: ‘వందేమాతరం’ వివాదంపై హైదరాబాద్ ఎంపీ, AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశ్నలు సంధించారు. మహాత్మా గాంధీ కంటే మోదీ ఎక్కువ తెలివైనవారా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ కంటే మోదీ దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా? రవీంద్రనాథ్ టాగోర్ కంటే మోదీ ఎక్కువ మేధావా? అంటూ ప్రశ్నించారు. ‘వందేమాతరం’ అంశాన్ని ప్రస్తావిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన సమయంలో వారిని ఇతర అంశాల వైపు మళ్లిస్తున్నారని ఓవైసీ విమర్శించారు. ఉద్యోగాల కోసం యువత రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ‘వందేమాతరం’పై తన అభిప్రాయాలను గతంలోనూ ఓవైసీ వెల్లడించారు.


