కర్నూలులో వింత ఘటన.. ఆవు పాలు తాగిన పంది పిల్ల
- ఆవు పాలు తాగుతున్న పంది పిల్ల.. సోషల్ మీడియాలో వైరల్
Kurnool News: కర్నూలు జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఓ పంది పిల్ల ఆవు నుంచి పాలు తాగడం కనిపించింది. సాధారణంగా ఆవు తన దూడకు మాత్రమే పాలు ఇస్తుండగా, ఇక్కడ పంది పిల్లకు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆవు పాలు ఇచ్చింది. పంది పిల్ల ఆవు దగ్గరకు వెళ్లి పాలు తాగుతుండగా ఆవు కూడా ప్రశాంతంగా నిలబడింది. ఈ వింత దృశ్యాన్ని అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారింది. ఆవు, పంది పిల్ల మధ్య కనిపించిన ఈ అనుబంధాన్ని చూసి నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
కర్నూలులో వింత ఘటన.. ఆవు పాలు తాగిన పంది పిల్ల
Kurnool News: కర్నూలు జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఓ పంది పిల్ల ఆవు నుంచి పాలు తాగడం కనిపించింది. సాధారణంగా ఆవు తన దూడకు మాత్రమే పాలు ఇస్తుండగా, ఇక్కడ పంది పిల్లకు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆవు పాలు ఇచ్చింది. పంది పిల్ల ఆవు దగ్గరకు వెళ్లి పాలు తాగుతుండగా ఆవు కూడా ప్రశాంతంగా నిలబడింది. ఈ వింత దృశ్యాన్ని అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారింది. ఆవు, పంది పిల్ల మధ్య కనిపించిన ఈ అనుబంధాన్ని చూసి నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.


