అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
- మరణ ధ్రువీకరణ పత్రం కోసం డబ్బులు అడిగారంటూ ఆరోపణ.. అనంతపురం మున్సిపాలిటీలో కలకలం
Anantapur Municipality: అనంతపురం మున్సిపల్ కార్యాలయంలోని జనన, మరణ ధ్రువీకరణ విభాగంపై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఓ మరణ ధ్రువీకరణ పత్రం విషయంలో అధికారి మధ్యవర్తి ద్వారా డబ్బులు అడిగినట్లు బాధితుడు ఆరోపించారు. మరణ ధ్రువీకరణ పత్రం ప్రక్రియ పూర్తయిన తర్వాత డబ్బులు ఇచ్చినట్లు బాధితుడు తెలిపినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ కార్యాలయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియపై మరోసారి చర్చ మొదలైంది.
ఇదే సమయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది. మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను సాయినగర్ జీరో క్రాస్లోని ఓ నెట్ సెంటర్కు తరలిస్తున్నారని గతంలో కూడా ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉచితంగా అందించాల్సిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నెట్ సెంటర్లో డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ బాధితులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి సర్టిఫికెట్ల ప్రక్రియను బయట నెట్ సెంటర్కు ఎందుకు మళ్లిస్తున్నారనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై గతంలో కూడా కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యపై పలుమార్లు దృష్టికి తీసుకువచ్చినా చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారిందని బాధితులు అంటున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను బయటకు తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
Anantapur Municipality: అనంతపురం మున్సిపల్ కార్యాలయంలోని జనన, మరణ ధ్రువీకరణ విభాగంపై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఓ మరణ ధ్రువీకరణ పత్రం విషయంలో అధికారి మధ్యవర్తి ద్వారా డబ్బులు అడిగినట్లు బాధితుడు ఆరోపించారు. మరణ ధ్రువీకరణ పత్రం ప్రక్రియ పూర్తయిన తర్వాత డబ్బులు ఇచ్చినట్లు బాధితుడు తెలిపినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ కార్యాలయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియపై మరోసారి చర్చ మొదలైంది.
ఇదే సమయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది. మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను సాయినగర్ జీరో క్రాస్లోని ఓ నెట్ సెంటర్కు తరలిస్తున్నారని గతంలో కూడా ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉచితంగా అందించాల్సిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నెట్ సెంటర్లో డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ బాధితులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి సర్టిఫికెట్ల ప్రక్రియను బయట నెట్ సెంటర్కు ఎందుకు మళ్లిస్తున్నారనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై గతంలో కూడా కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యపై పలుమార్లు దృష్టికి తీసుకువచ్చినా చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారిందని బాధితులు అంటున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను బయటకు తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.


