బేతోల్ గ్రామంలో చోరీ.. బంగారం, వెండి, నగదు అపహరణ
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోల్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గయిని వెంకన్న ఇంటి తాళాలు, తలుపులు పగులగొట్టి నాలుగు తులాల బంగారం, 54 తులాల వెండి ఆభరణాలు, రూ.44 వేల నగదును అపహరించారు. బాధితులు వెంకన్న, యాదమ్మ దంపతులు నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లగా, తిరిగి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతరం కొరివి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, కొరివి ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బేతోల్ గ్రామంలో చోరీ.. బంగారం, వెండి, నగదు అపహరణ
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోల్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గయిని వెంకన్న ఇంటి తాళాలు, తలుపులు పగులగొట్టి నాలుగు తులాల బంగారం, 54 తులాల వెండి ఆభరణాలు, రూ.44 వేల నగదును అపహరించారు. బాధితులు వెంకన్న, యాదమ్మ దంపతులు నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లగా, తిరిగి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతరం కొరివి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, కొరివి ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


