మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు

ఆధార్ పెన్షన్లకు వయసు సడలింపు కోరిన గూడూరు శ్రీనివాస్, దూడెం వెంకటరమణ.

మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు

విశ్వంభర, హైదరాబాద్:- ఆధార్ ఆధారిత పెన్షన్లకు సంబంధించి అర్హత వయసులో సడలింపు కల్పించాలని కోరుతూ తెలంగాణ పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ రాష్ట్ర మంత్రి సీతక్కను తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి  వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్లు మాట్లాడుతూ, వయసు నిబంధనల కారణంగా అర్హత ఉన్న పలువురు వృద్ధులు పెన్షన్‌ ప్రయోజనాలను పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా చేనేత, పద్మశాలి వర్గాలకు చెందిన పేదలు, వృద్ధులు మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెన్షన్‌ ఎంతో అవసరమని వివరించారు.ప్రస్తుత వయసు అర్హత నిబంధనలను పరిశీలించి, అర్హులైన వారికి పెన్షన్‌ అందేలా వయసు సడలింపు కల్పించాలని చైర్మన్లు మంత్రి సీతక్కను కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.చైర్మన్ల విజ్ఞప్తిని మంత్రి సీతక్క సానుకూలంగా విని, సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 18 Aug 2026 ✍️ Desk

మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు

ఆధార్ పెన్షన్లకు వయసు సడలింపు కోరిన గూడూరు శ్రీనివాస్, దూడెం వెంకటరమణ.

విశ్వంభర, హైదరాబాద్:- ఆధార్ ఆధారిత పెన్షన్లకు సంబంధించి అర్హత వయసులో సడలింపు కల్పించాలని కోరుతూ తెలంగాణ పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ రాష్ట్ర మంత్రి సీతక్కను తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి  వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్లు మాట్లాడుతూ, వయసు నిబంధనల కారణంగా అర్హత ఉన్న పలువురు వృద్ధులు పెన్షన్‌ ప్రయోజనాలను పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా చేనేత, పద్మశాలి వర్గాలకు చెందిన పేదలు, వృద్ధులు మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెన్షన్‌ ఎంతో అవసరమని వివరించారు.ప్రస్తుత వయసు అర్హత నిబంధనలను పరిశీలించి, అర్హులైన వారికి పెన్షన్‌ అందేలా వయసు సడలింపు కల్పించాలని చైర్మన్లు మంత్రి సీతక్కను కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.చైర్మన్ల విజ్ఞప్తిని మంత్రి సీతక్క సానుకూలంగా విని, సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/chairmen-of-padmasali-handloom-corporations-met-minister-sitakka/article-21805

Tags:  

Advertisement

LatestNews

గుడుంబా,మద్యం వ్యాపారి నెటుల శోభారాణిపై పీడీ యాక్ట్. 
అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా. - మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు 
మంత్రి కోమటిరెడ్డి చేతులమీదుగా  గద్దర్ డాక్యుమెంటరీ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ. 
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిహెచ్ఎంసి అధికారి ప్రభావతి.
మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు
శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే