ప్రజల కోసం.. ప్రజల తరపున.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన
- కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి క్లారిటీ.. ఈ నెలలోనే ఏర్పాట్లకు శ్రీకారం
Vijayasai Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజా పక్షంగా నిలుస్తూ ప్రజల గొంతును వినిపించేందుకు నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో ప్రజల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొత్త పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నూతన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. పార్టీ ఏర్పాటు, విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై పోరాడే విధంగా పార్టీ నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం జరిగేలా వారి తరఫున గళం వినిపించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
తిరుమల పర్యటన అనంతరం విజయసాయి రెడ్డి చేసిన ఈ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు కొత్త పార్టీ ఏర్పాటుపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఆయన ప్రకటనతో స్పష్టత వచ్చినట్లైంది. కొత్త పార్టీ పేరు ఏమిటి? పార్టీ గుర్తు ఏంటి? ఎవరెవరు ఆయనతో కలిసి పనిచేయనున్నారు? పార్టీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. ఈ నెలలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని విజయసాయి రెడ్డి ప్రకటించడంతో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ప్రజల కోసం.. ప్రజల తరపున.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన
Vijayasai Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజా పక్షంగా నిలుస్తూ ప్రజల గొంతును వినిపించేందుకు నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో ప్రజల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొత్త పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నూతన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. పార్టీ ఏర్పాటు, విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై పోరాడే విధంగా పార్టీ నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం జరిగేలా వారి తరఫున గళం వినిపించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
తిరుమల పర్యటన అనంతరం విజయసాయి రెడ్డి చేసిన ఈ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు కొత్త పార్టీ ఏర్పాటుపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఆయన ప్రకటనతో స్పష్టత వచ్చినట్లైంది. కొత్త పార్టీ పేరు ఏమిటి? పార్టీ గుర్తు ఏంటి? ఎవరెవరు ఆయనతో కలిసి పనిచేయనున్నారు? పార్టీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. ఈ నెలలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని విజయసాయి రెడ్డి ప్రకటించడంతో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


