బట్ట కాల్చి నాపై వేస్తే ఊరుకోను.. కాంగ్రెస్కు హరీష్ రావు వార్నింగ్
- క్షుద్రపూజల వ్యాఖ్యలపై హరీష్ ఫైర్.. పరువు నష్టం, క్రిమినల్ కేసులు వేస్తా
- హద్దులు దాటితే చట్టపరమైన చర్యలు తప్పవు.. కాంగ్రెస్కు హరీష్ రావు హెచ్చరిక
Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తనపై చేసిన క్షుద్రపూజల ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దులు ఉండాలని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాల పేరుతో నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. "బట్ట కాల్చి నా మీద వేయాలని చూస్తే ఊరుకునేది లేదు. నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఉండను" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, స్కాములను తాను బయటపెడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.
గతంలో మంత్రి కొండా సురేఖ కూడా ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు, పరువు నష్టం దావాలు వేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించామని, అవసరమైతే న్యాయపరంగా చివరి వరకు పోరాడతానని వెల్లడించారు.
రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చని, కానీ వ్యక్తిగతంగా దూషించడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హరీష్ రావు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఇకపై ఏమాత్రం సహించబోనని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
బట్ట కాల్చి నాపై వేస్తే ఊరుకోను.. కాంగ్రెస్కు హరీష్ రావు వార్నింగ్
Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తనపై చేసిన క్షుద్రపూజల ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దులు ఉండాలని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాల పేరుతో నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. "బట్ట కాల్చి నా మీద వేయాలని చూస్తే ఊరుకునేది లేదు. నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఉండను" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, స్కాములను తాను బయటపెడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.
గతంలో మంత్రి కొండా సురేఖ కూడా ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు, పరువు నష్టం దావాలు వేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించామని, అవసరమైతే న్యాయపరంగా చివరి వరకు పోరాడతానని వెల్లడించారు.
రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చని, కానీ వ్యక్తిగతంగా దూషించడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హరీష్ రావు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఇకపై ఏమాత్రం సహించబోనని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.


