విద్యుత్ ఉద్యోగులకు జెన్‌కో వార్నింగ్.. ధర్నాలు చేస్తే చర్యలు తప్పవు

విద్యుత్ ఉద్యోగులకు జెన్‌కో వార్నింగ్.. ధర్నాలు చేస్తే చర్యలు తప్పవు

  • 19న మహాధర్నాకు పవర్ జేఏసీ పిలుపు.. అనుమతి లేదన్న జెన్‌కో

Telangana Power Employees: తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా నేపథ్యంలో జెన్‌కో కీలక హెచ్చరిక జారీ చేసింది. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ జేఏసీ ఈ నెల 19న హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని జెన్‌కో స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై ఎస్మా-1971 చట్టం కింద ఆరు నెలల పాటు నిషేధం అమల్లో ఉందని పేర్కొంది.

విద్యుత్ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సౌధ, జీటీఎస్ కాలనీల్లో ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి లేదని జెన్‌కో తెలిపింది. ఎస్మా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగులు, కార్మికులు ధర్నాలు, సమ్మెలకు దిగితే నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జెన్‌కో డైరెక్టర్ కుమార్ రాజు మంగళవారం మెమో జారీ చేసినట్లు సమాచారం.

Read More తొర్రూరు మార్కెట్ అభివృద్ధికి నిధుల వరద

మరోవైపు ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహించాలని పవర్ జేఏసీ నిర్ణయించింది. పెండింగ్ సమస్యలు, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే ఎస్మా అమల్లో ఉన్నందున ధర్నాకు అనుమతి లేదని జెన్‌కో స్పష్టం చేయడంతో ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల ఆందోళనపై ఉత్కంఠ నెలకొంది. నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేపట్టే ఉద్యోగులు, కార్మికులపై చర్యలు తీసుకుంటామని జెన్‌కో డైరెక్టర్ కుమార్ రాజు హెచ్చరించారు. దీంతో ఈ నెల 19న పవర్ జేఏసీ మహాధర్నా నిర్వహిస్తుందా? లేక జెన్‌కో హెచ్చరికల నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.

🕒 19 Aug 2026 ✍️ Desk

విద్యుత్ ఉద్యోగులకు జెన్‌కో వార్నింగ్.. ధర్నాలు చేస్తే చర్యలు తప్పవు

Telangana Power Employees: తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా నేపథ్యంలో జెన్‌కో కీలక హెచ్చరిక జారీ చేసింది. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ జేఏసీ ఈ నెల 19న హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని జెన్‌కో స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై ఎస్మా-1971 చట్టం కింద ఆరు నెలల పాటు నిషేధం అమల్లో ఉందని పేర్కొంది.

విద్యుత్ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సౌధ, జీటీఎస్ కాలనీల్లో ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి లేదని జెన్‌కో తెలిపింది. ఎస్మా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగులు, కార్మికులు ధర్నాలు, సమ్మెలకు దిగితే నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జెన్‌కో డైరెక్టర్ కుమార్ రాజు మంగళవారం మెమో జారీ చేసినట్లు సమాచారం.

మరోవైపు ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహించాలని పవర్ జేఏసీ నిర్ణయించింది. పెండింగ్ సమస్యలు, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే ఎస్మా అమల్లో ఉన్నందున ధర్నాకు అనుమతి లేదని జెన్‌కో స్పష్టం చేయడంతో ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల ఆందోళనపై ఉత్కంఠ నెలకొంది. నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేపట్టే ఉద్యోగులు, కార్మికులపై చర్యలు తీసుకుంటామని జెన్‌కో డైరెక్టర్ కుమార్ రాజు హెచ్చరించారు. దీంతో ఈ నెల 19న పవర్ జేఏసీ మహాధర్నా నిర్వహిస్తుందా? లేక జెన్‌కో హెచ్చరికల నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.

🔗 https://www.vishvambhara.com/telangana/actions-will-be-taken-if-genco-warning-sit-ins-for-electricity/article-21845

Advertisement

LatestNews