అగ్ని ప్రమాద భాదిత కుటుంబానికి ఆర్ధిక సాయం
On
విశ్వంభర, ఎల్బీనగర్ : కర్మన్ఘాట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక పేద కుటుంబం ఇల్లును కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో మిగిలిపోయింది. ఆ కుటుంబ స్థితిని గమనించిన బి.ఆర్.టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య వెంటనే స్పందించి, ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్ తోట మహేష్ యాదవ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మహేష్ యాదవ్ ఆ కుటుంబాన్ని ఆదుకొని, స్వయంగా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుండి కలెక్టర్ ఆఫీస్ ద్వారా అందబోయే పరిహారం విషయాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోటల్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంకల అనిల్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి ప్రతాప్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
🕒 25 Aug 2025 ✍️ Desk
అగ్ని ప్రమాద భాదిత కుటుంబానికి ఆర్ధిక సాయం
విశ్వంభర, ఎల్బీనగర్ : కర్మన్ఘాట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక పేద కుటుంబం ఇల్లును కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో మిగిలిపోయింది. ఆ కుటుంబ స్థితిని గమనించిన బి.ఆర్.టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య వెంటనే స్పందించి, ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్ తోట మహేష్ యాదవ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మహేష్ యాదవ్ ఆ కుటుంబాన్ని ఆదుకొని, స్వయంగా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుండి కలెక్టర్ ఆఫీస్ ద్వారా అందబోయే పరిహారం విషయాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోటల్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంకల అనిల్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి ప్రతాప్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
🔗 https://www.vishvambhara.com/financial-aid-to-the-family-of-fire/article-6184


