రాఖీ పండుగకు పవన్ కల్యాణ్ ఆత్మీయ కానుక.. 2,300 మంది చెల్లెమ్మలకు చీరలు
- పిఠాపురం చెల్లెమ్మలకు పవన్ కల్యాణ్ రాఖీ కానుక
Pawan Kalyan: రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలోని 2,300 మంది చెల్లెమ్మలకు ఆత్మీయ కానుక అందించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలకు చీరలను అందించి “అన్నగా నేను ఉన్నాను” అనే భరోసాను కల్పించారు. పండుగ సందర్భంగా చెల్లెమ్మల పట్ల తనకున్న ఆప్యాయతను చాటుతూ ఈ ప్రత్యేక కానుకను అందించారు.
రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, అనుబంధం, నమ్మకం, రక్షణకు ప్రతీక. సోదరి తన అన్నయ్య లేదా తమ్ముడికి రాఖీ కట్టి, అతడు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటే.. అన్న కూడా తన సోదరికి ఎల్లప్పుడూ అండగా ఉంటాననే భరోసా ఇస్తాడు. ఇదే ఆత్మీయతను ప్రతిబింబించేలా పిఠాపురం నియోజకవర్గంలోని 2,300 మంది చెల్లెమ్మలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చీరలను అందించారు.
ఈ సందర్భంగా అందించిన చీరలు కేవలం పండుగ కానుక మాత్రమే కాకుండా.. ప్రేమ, గౌరవం, ఆప్యాయతతో అందించిన అన్నయ్య కానుకగా నిలిచాయని జనసేన శ్రేణులు పేర్కొన్నాయి. ప్రజాప్రతినిధిగా పిఠాపురం ప్రజలతో తనకున్న అనుబంధాన్ని మరింత బలపరిచే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా 2,300 మంది మహిళలకు చీరలు అందించడం పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. పండుగ వేళ తమను గుర్తు చేసుకుని ఆత్మీయంగా కానుక అందించడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా.. అన్నగా తమకు అండగా ఉంటాననే భరోసాను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా చాటారని జనసేన శ్రేణులు తెలిపారు.
రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం చెల్లెమ్మలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందించిన ఈ కానుక నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిలిచింది. “అది కేవలం చీర కాదు.. ప్రేమ, గౌరవం, ఆత్మీయతతో అందించిన అన్నయ్య కానుక” అంటూ జనసేన శ్రేణులు పేర్కొన్నారు.



