రైతుల ప్రాణాలు కాపాడండి సీఎం రేవంత్ రెడ్డి.. ఎండిన పంటల వద్ద అన్నదాత ఆవేదన

రైతుల ప్రాణాలు కాపాడండి సీఎం రేవంత్ రెడ్డి.. ఎండిన పంటల వద్ద అన్నదాత ఆవేదన

  • మా బాధలు వినండి సీఎం రేవంత్ రెడ్డి: వరంగల్ జిల్లాలో ఫ్లెక్సీతో రైతు వినూత్న నిరసన

Warangal Farmers: వానాకాలం సీజన్‌లోనూ రైతన్న కష్టాలు తప్పడం లేదు. సమృద్ధిగా వర్షాలు లేక పంటలు పండించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోవడంతో అప్పుల భారం మరింత పెరుగుతోందని వాపోతున్నారు.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు లక్ష్మి తన పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరారు. సాగు చేసిన పంటకు అవసరమైన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటను వదిలేయాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “అప్పులు చేసి పంటలు వేశాం. వర్షాలు కురవకపోవడంతో పంటను వదిలేశాం. బావి కూడా ఎండిపోయింది. కెనాల్‌లో నీరు కూడా వదలడం లేదు” అంటూ లక్ష్మి తన పరిస్థితిని వివరించారు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో కుటుంబంపై ఆర్థిక భారం పెరుగుతోందని తెలిపారు.

Read More భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ప్రత్యేక పూజలు

పంట కోసం చేసిన అప్పులు, బ్యాంకు రుణాలు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అన్నం పెట్టే అన్నదాతల ప్రాణాలను కాపాడాలి” అంటూ లక్ష్మి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పంట నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని ఆమె కోరారు.

Related Posts