ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై దారుణం.. అత్యాచారం చేసి హత్య

ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై దారుణం.. అత్యాచారం చేసి హత్య

  • కదులుతున్న టెంపోలో బాలికపై అఘాయిత్యం.. అనంతరం హత్య చేసిన నలుగురు

Delhi Crime: ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ–స్వరూప్‌నగర్ ప్రాంతంలోని కుషాక్ రోడ్ సమీపంలోని పొలాల్లో ఈ నెల 13న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలిక సెప్టెంబర్ 1న స్నేహితుడిని కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఆమెను మరో స్నేహితుడు టెంపోలో ఎక్కించుకుని, అప్పటికే వాహనంలో ఉన్న మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

అనంతరం బాలికను హత్య చేసి మృతదేహాన్ని స్వరూప్‌నగర్‌లోని పొలాల్లో వదిలేసి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.టెంపో నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించిన శివమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరో ముగ్గురు మైనర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ ఘటనలో నిందితులంతా బాలికకు పరిచయస్తులేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.

Read More అనంతపురంలో దారుణ హత్య.. సిండికేట్‌ నగర్‌లో భరద్వాజ్‌ మృతి

Related Posts

Advertisement

LatestNews

విద్యార్థుల సంక్షేమానికి గద్దె విజయ్ నేత సేవా కార్యక్రమం.
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి.. హోంగార్డు ఆనంద్ అరెస్ట్
సీఎం పర్యటనతో విశాఖలో బస్సుల కొరత.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్ అరవింద్ కుమార్ జన్మదినం సందర్బంగా ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ , ప్రోటీన్ మిల్క్ షేక్స్ పంపిణి 
రేపే కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ.. బ్లూప్రింట్ ప్రకటించనున్న కవిత
మచిలీపట్నంలో వివాహ వివాదం.. భర్త ఇంటి ఎదుట మహిళ ఆందోళన
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టులోకి దూసుకెళ్లిన కారు