యూరియా కోసం గణపతి మండపంలో లక్కీ డ్రా.. నిజామాబాద్‌లో వినూత్న నిరసన

యూరియా కోసం గణపతి మండపంలో లక్కీ డ్రా.. నిజామాబాద్‌లో వినూత్న నిరసన

  • రూ.99 టోకెన్‌తో మూడు యూరియా బస్తాలు గెలుచుకునే అవకాశం

Nizamabad News: నిజామాబాద్ జిల్లా రూప్లా తండాలో యూరియా కోసం బంజారా కింగ్స్ యూత్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. యూరియా కొరతను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గణపతి మండపంలో లక్కీ డ్రా నిర్వహించారు.

రూ.99 విలువైన లక్కీ డ్రా టోకెన్‌ను ఏర్పాటు చేసి, అందులో విజేతలకు మూడు యూరియా బస్తాలు అందించే అవకాశం కల్పించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు యూత్ సభ్యులు తెలిపారు.

Read More NEET పరీక్ష కేంద్రంలో షాకింగ్‌ ఘటన.. మద్యం మత్తులో వచ్చిన విద్యార్థి

యాప్‌లో యూరియా కోసం బుక్ చేసుకున్నప్పటికీ, బస్తాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుకింగ్ చేసిన రైతులకు యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

యూరియా సమస్యపై అధికారులు వెంటనే స్పందించి రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని బంజారా కింగ్స్ యూత్ సభ్యులు కోరారు. సమస్యను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ వినూత్న నిరసన చేపట్టినట్లు తెలిపారు.

Related Posts

Advertisement

LatestNews

విద్యార్థుల సంక్షేమానికి గద్దె విజయ్ నేత సేవా కార్యక్రమం.
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి.. హోంగార్డు ఆనంద్ అరెస్ట్
సీఎం పర్యటనతో విశాఖలో బస్సుల కొరత.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్ అరవింద్ కుమార్ జన్మదినం సందర్బంగా ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ , ప్రోటీన్ మిల్క్ షేక్స్ పంపిణి 
రేపే కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ.. బ్లూప్రింట్ ప్రకటించనున్న కవిత
మచిలీపట్నంలో వివాహ వివాదం.. భర్త ఇంటి ఎదుట మహిళ ఆందోళన
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టులోకి దూసుకెళ్లిన కారు