శ్రావణ సోమవారం శివార్చన.. భక్తిశ్రద్ధలతో మహాదేవుని పూజలు

శ్రావణ సోమవారం శివార్చన.. భక్తిశ్రద్ధలతో మహాదేవుని పూజలు

  • సోమవారం మహాదేవుని దర్శనం.. శివారాధనకు అత్యంత పవిత్రమైన రోజు
  • సోమవార వ్రతంతో ఉమామహేశ్వరుల అనుగ్రహం.. భక్తులకు ప్రత్యేక ప్రాధాన్యం

Lord Shiva: హిందూ సంప్రదాయంలో సోమవారం పరమశివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ రోజున భక్తులు తెల్లవారుజామునే శివాలయాలకు చేరుకుని మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బిల్వదళాలు, పాలు, నీరు, తేనె, పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేసి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు. శివుని కటాక్షం పొందేందుకు లక్షలాది మంది భక్తులు సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు. 'సోమ' అనే పదం పరమశివుడిని సూచిస్తుందని పురాణాలు పేర్కొంటాయి. అందుకే సోమవారం రోజును మహాదేవునికి అంకితమైన దినంగా భావిస్తారు.

ఈ రోజున ఉపవాసం ఉండి ఉమామహేశ్వరులను భక్తితో ఆరాధిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, మనశ్శాంతి లభిస్తాయని భక్తుల విశ్వాసం. అవివాహితులు మంచి జీవిత భాగస్వామి కోసం, వివాహితులు దాంపత్య సుఖం, కుటుంబ శ్రేయస్సు కోసం సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ సోమవారాల సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక దర్శనాలు, రుద్రాభిషేకాలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, శివనామ స్మరణ, భజనలు నిర్వహిస్తున్నారు. భక్తులు "ఓం నమః శివాయ" నామస్మరణతో పరమశివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు.

Read More శ్రీశైలంలో భక్తుల రద్దీ.. మల్లన్న దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం

Related Posts