రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి : నటుడు జగపతి బాబు

రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి : నటుడు జగపతి బాబు

విశ్వంభర, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ మోసాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టే్ట్‌లో భారీగా మోసాలు జరుగుతున్నాయన్నారు. అభిమానులు, సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూమి కొనేముందు రెరా నిబంధనలు గుర్తించి పూర్తిగా తెలుసుకోని ప్రాపర్టీ కొనాలన్నారు. తనను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేశారని వాపోయారు.

ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన యాడ్‌లో నటించా అని చెప్పారు. చెక్కు విషయంలో వాళ్లు మోసం చేశారని తెలిపారు. తనను మోసగించిన వాళ్లు ఎవరు.. అసలు ఏం జరిగింది వంటి విషయాలను త్వరలోనే బయటపెడతా అన్నారు. రియల్ ఎస్టేట్ గురించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా హెచ్చరించారని జగపతి బాబు గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.

Related Posts

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు