పల్నాడులో వైసీపీ నేత దారుణ హత్య.. గొంతు కోసి హతమార్చిన దుండగులు
రెంటచింతలలో వైఎస్సార్సీపీ నాయకుడి దారుణ హత్య.
Crime News: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి (35)ను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన రెంటచింతల మండలంలో కలకలం రేపింది. స్థానికంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతల–రెంటాల ప్రధాన మార్గంలోని పులోళ్ల బావి సమీపంలో నవులూరి చెన్నారెడ్డి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. చెన్నారెడ్డిని గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. వ్యక్తిగత విభేదాలా, రాజకీయ కక్షలా, లేక మరేదైనా కారణమా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనతో రెంటచింతల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నారెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరిస్తూ దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పల్నాడులో వైసీపీ నేత దారుణ హత్య.. గొంతు కోసి హతమార్చిన దుండగులు
Crime News: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి (35)ను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన రెంటచింతల మండలంలో కలకలం రేపింది. స్థానికంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతల–రెంటాల ప్రధాన మార్గంలోని పులోళ్ల బావి సమీపంలో నవులూరి చెన్నారెడ్డి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. చెన్నారెడ్డిని గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. వ్యక్తిగత విభేదాలా, రాజకీయ కక్షలా, లేక మరేదైనా కారణమా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనతో రెంటచింతల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నారెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరిస్తూ దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


