పనీర్ తింటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
నకిలీ పనీర్కు చెక్.. మహారాష్ట్రలో ఏడాది నిషేధం..
Maharashtra Fake Paneer: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలతో కాకుండా ఇతర పదార్థాలతో తయారు చేసే నాన్-డెయిరీ లేదా అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం, నాసిరకం పదార్థాలతో పనీర్ తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ వెల్లడించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జీవిత ఖైదుతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
సాధారణ పనీర్ పూర్తిగా పాలతో తయారవుతుంది. పాలను నిమ్మరసం లేదా వెనిగర్ వంటి ఆహారానికి అనుకూలమైన ఆమ్లంతో గడ్డకట్టించి తయారు చేస్తారు. ఇందులో శరీరానికి అవసరమైన అధిక నాణ్యత గల ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఎముకల బలం, కండరాల పెరుగుదల, శరీర ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అయితే అనలాగ్ పనీర్ను తక్కువ నాణ్యత గల వృక్ష నూనెలు, స్టార్చ్, రసాయనాలు, ఇతర కల్తీ పదార్థాలతో తయారు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు చూడటానికి అసలు పనీర్లాగే కనిపించినప్పటికీ, పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయని, పరిశుభ్రత పాటించకుండా తయారు చేస్తే జీర్ణ సమస్యలు, ఆహార విషబాధలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
మార్కెట్లో అసలు పనీర్, నకిలీ పనీర్ మధ్య తేడా గుర్తించడం సాధారణ వినియోగదారులకు చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. రూపం, రంగు, రుచి దాదాపు ఒకేలా ఉండటంతో చాలా మంది మోసపోయే అవకాశం ఉందన్నారు. అందుకే పేరున్న బ్రాండ్ల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని, విశ్వసనీయ దుకాణాలు, హోటళ్ల నుంచి మాత్రమే పనీర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆహార పదార్థాలను కొనుగోలు చేసే ముందు వాటిపై ఉన్న లేబుల్, పదార్థాల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్గఢ్ కూడా ఇలాంటి నిషేధాన్ని అమలు చేసిన రాష్ట్రంగా నిలిచింది. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే ప్రభుత్వాల లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఆరోగ్యంపై రాజీ పడకుండా నాణ్యమైన పాల ఉత్పత్తులనే వినియోగించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
పనీర్ తింటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
Maharashtra Fake Paneer: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలతో కాకుండా ఇతర పదార్థాలతో తయారు చేసే నాన్-డెయిరీ లేదా అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం, నాసిరకం పదార్థాలతో పనీర్ తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ వెల్లడించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జీవిత ఖైదుతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
సాధారణ పనీర్ పూర్తిగా పాలతో తయారవుతుంది. పాలను నిమ్మరసం లేదా వెనిగర్ వంటి ఆహారానికి అనుకూలమైన ఆమ్లంతో గడ్డకట్టించి తయారు చేస్తారు. ఇందులో శరీరానికి అవసరమైన అధిక నాణ్యత గల ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఎముకల బలం, కండరాల పెరుగుదల, శరీర ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అయితే అనలాగ్ పనీర్ను తక్కువ నాణ్యత గల వృక్ష నూనెలు, స్టార్చ్, రసాయనాలు, ఇతర కల్తీ పదార్థాలతో తయారు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు చూడటానికి అసలు పనీర్లాగే కనిపించినప్పటికీ, పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయని, పరిశుభ్రత పాటించకుండా తయారు చేస్తే జీర్ణ సమస్యలు, ఆహార విషబాధలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
మార్కెట్లో అసలు పనీర్, నకిలీ పనీర్ మధ్య తేడా గుర్తించడం సాధారణ వినియోగదారులకు చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. రూపం, రంగు, రుచి దాదాపు ఒకేలా ఉండటంతో చాలా మంది మోసపోయే అవకాశం ఉందన్నారు. అందుకే పేరున్న బ్రాండ్ల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని, విశ్వసనీయ దుకాణాలు, హోటళ్ల నుంచి మాత్రమే పనీర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆహార పదార్థాలను కొనుగోలు చేసే ముందు వాటిపై ఉన్న లేబుల్, పదార్థాల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్గఢ్ కూడా ఇలాంటి నిషేధాన్ని అమలు చేసిన రాష్ట్రంగా నిలిచింది. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే ప్రభుత్వాల లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఆరోగ్యంపై రాజీ పడకుండా నాణ్యమైన పాల ఉత్పత్తులనే వినియోగించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.


