క్రోచెట్ కళాకారులకు పవన్ కళ్యాణ్ చేయూత.. ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ
- క్రోచెట్ లేస్ కళాకారుల కంటి సమస్యలకు పరిష్కారం.. 141 మందికి కళ్లజోళ్లు
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న చిన్న అల్లికలను గంటల తరబడి చూస్తూ పని చేసే క్రోచెట్ లేస్ కళాకారుల కంటి సమస్యలను గుర్తించి వారికి అండగా నిలిచారు. వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, దృష్టి లోపాలతో బాధపడుతున్న 141 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు అందించే ఏర్పాట్లు చేశారు. కళాకారుల వృత్తి కొనసాగేందుకు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
గత నెల విజయవాడలో నిర్వహించిన హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్, హస్తకళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి మహాలక్ష్మి తమ వృత్తి కారణంగా చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఆమె వినతిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల కోసం క్లస్టర్ల వారీగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆ ఆదేశాల మేరకు నరసాపురంలో నిర్వహించిన తొలి నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్న కళాకారులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం 141 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించగా, వారందరికీ నాణ్యమైన కళ్లజోళ్లు సిద్ధం చేసి అందజేస్తున్నారు. దీంతో అల్లిక పనిలో ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గి, తమ వృత్తిని మరింత సౌకర్యంగా కొనసాగించగలమని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడితో ఆగకుండా పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలి ప్రాంతాల్లో కూడా మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో మరో 350 మంది కళాకారులకు దృష్టి లోపాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి కూడా కళ్లజోళ్లు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే 20 మందికి పైగా కంటిశుక్లం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.
హస్తకళాకారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆచంట, నరసాపురం ప్రాంతాల్లో మరిన్ని ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా క్రోచెట్ లేస్ కళాకారులకు అవసరమైన వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.
క్రోచెట్ కళాకారులకు పవన్ కళ్యాణ్ చేయూత.. ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న చిన్న అల్లికలను గంటల తరబడి చూస్తూ పని చేసే క్రోచెట్ లేస్ కళాకారుల కంటి సమస్యలను గుర్తించి వారికి అండగా నిలిచారు. వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, దృష్టి లోపాలతో బాధపడుతున్న 141 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు అందించే ఏర్పాట్లు చేశారు. కళాకారుల వృత్తి కొనసాగేందుకు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
గత నెల విజయవాడలో నిర్వహించిన హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్, హస్తకళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి మహాలక్ష్మి తమ వృత్తి కారణంగా చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఆమె వినతిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల కోసం క్లస్టర్ల వారీగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆ ఆదేశాల మేరకు నరసాపురంలో నిర్వహించిన తొలి నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్న కళాకారులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం 141 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించగా, వారందరికీ నాణ్యమైన కళ్లజోళ్లు సిద్ధం చేసి అందజేస్తున్నారు. దీంతో అల్లిక పనిలో ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గి, తమ వృత్తిని మరింత సౌకర్యంగా కొనసాగించగలమని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడితో ఆగకుండా పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలి ప్రాంతాల్లో కూడా మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో మరో 350 మంది కళాకారులకు దృష్టి లోపాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి కూడా కళ్లజోళ్లు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే 20 మందికి పైగా కంటిశుక్లం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.
హస్తకళాకారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆచంట, నరసాపురం ప్రాంతాల్లో మరిన్ని ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా క్రోచెట్ లేస్ కళాకారులకు అవసరమైన వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.


