ఐదుగురు వచ్చారు.. దృష్టి మళ్లించారు.. బంగారు గొలుసుతో ఉడాయించారు
- నగల దుకాణంలో చాకచక్యంగా చోరీ.. సీసీ కెమెరాలో దొంగల మాయాజాలం
Vikarabad Gold Chain Theft: వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ నగల దుకాణంలో చోరీ ఘటన కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు సిబ్బంది దృష్టి మరల్చి 10 గ్రాముల బంగారు గొలుసును అత్యంత చాకచక్యంగా అపహరించారు. క్షణాల్లోనే దొంగతనానికి పాల్పడి అక్కడి నుంచి పరారవడంతో దుకాణ యజమాని, సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
సమాచారం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు సాధారణ కస్టమర్ల మాదిరిగా నగల దుకాణంలోకి ప్రవేశించారు. నగలు చూపించాలని కోరుతూ సిబ్బందిని మాటల్లో పెట్టారు. ఇదే సమయంలో వారిలో ఒకరు సిబ్బంది దృష్టి మరల్చగా, మరో వ్యక్తి అవకాశం చూసుకుని 10 గ్రాముల బంగారు గొలుసును చాకచక్యంగా కాజేశాడు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కొంతసేపటి తర్వాత నగలు పరిశీలించిన దుకాణ సిబ్బందికి బంగారు గొలుసు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే దుకాణంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా, కస్టమర్ల వేషంలో వచ్చిన వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన విషయం బయటపడింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఘటనపై దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాపారులు దుకాణాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఐదుగురు వచ్చారు.. దృష్టి మళ్లించారు.. బంగారు గొలుసుతో ఉడాయించారు
Vikarabad Gold Chain Theft: వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ నగల దుకాణంలో చోరీ ఘటన కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు సిబ్బంది దృష్టి మరల్చి 10 గ్రాముల బంగారు గొలుసును అత్యంత చాకచక్యంగా అపహరించారు. క్షణాల్లోనే దొంగతనానికి పాల్పడి అక్కడి నుంచి పరారవడంతో దుకాణ యజమాని, సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
సమాచారం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు సాధారణ కస్టమర్ల మాదిరిగా నగల దుకాణంలోకి ప్రవేశించారు. నగలు చూపించాలని కోరుతూ సిబ్బందిని మాటల్లో పెట్టారు. ఇదే సమయంలో వారిలో ఒకరు సిబ్బంది దృష్టి మరల్చగా, మరో వ్యక్తి అవకాశం చూసుకుని 10 గ్రాముల బంగారు గొలుసును చాకచక్యంగా కాజేశాడు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కొంతసేపటి తర్వాత నగలు పరిశీలించిన దుకాణ సిబ్బందికి బంగారు గొలుసు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే దుకాణంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా, కస్టమర్ల వేషంలో వచ్చిన వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన విషయం బయటపడింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఘటనపై దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాపారులు దుకాణాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


