కొడాలి నానిపై కేసు నమోదు
On
- మాజీ మంత్రి నానిపై వలంటీర్ల ఫిర్యాదు
- తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ
- గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీమంత్రి కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. ఆయనపై పలువురు మాజీ వార్డు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆరోపిస్తూ వలంటీర్లు ఫిర్యాదు చేయడంతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.